గత నెల జూన్ ఆఖరున వచ్చిన కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ రికార్డులతో థియేటర్లను కళకళలాడించగా అదే జోరును జూలైలో కొత్త సినిమాలు కొనసాగిస్తాయని బయ్యర్లు ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పటిదాకా అలా జరగలేదు. కల్కి దెబ్బకు మొదటి వారంని అందరూ వదిలేయగా సెకండ్ వీక్ లో వచ్చిన భారతీయుడు 2 నిండా ముంచేసింది. డిజాస్టర్ టాక్ తోడు తెలంగాణలో కోరి పెంచుకున్న టికెట్ రేట్లు మరింత చేటు కలిగించాయి. ఆపై వారం ప్రియదర్శి డార్లింగ్ తీవ్రంగా నిరాశపరచగా మంచి ప్రమోషన్లు చేసుకున్న పేకమేడలు, ది బర్త్ డే బాయ్ లు సైతం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయాయి.
ఇప్పుడు చివరి వారం వచ్చేసింది. రేపు ముక్కోణపు పోటీ ఉంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది డబ్బింగ్ మూవీ రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ మాఫియా డ్రామాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్జె సూర్య విలనీ, ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి భారీ ఆకర్షణలు పూర్తి స్థాయిలో బజ్ ని తీసుకురాలేకపోతున్నాయి. తమిళనాడు బుకింగ్స్ చాలా బాగున్నప్పటికీ తెలుగులో హైదరాబాద్ మినహాయించి మిగిలిన చోట్ల చాలా నెమ్మదిగా ఉన్నాయి. మహారాజ తరహాలో టాక్ క్రమంగా పెరిగి జనాలు వస్తే సూపర్ హిట్ పడొచ్చు. అది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది.
రాజ్ తరుణ్ పురుషోత్తముడు రేపే వస్తోంది. హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు చేసేశారు. పెద్ద క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ విలేజ్ మాస్ డ్రామాకు గోపి సుందర్ సంగీతం అందించారు. హడావిడి లేకపోయినా టాక్ తో జనమే తమకు పబ్లిసిటీ చేస్తారని టీమ్ బలంగా నమ్ముతోంది. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా రూపొందిన ఆపరేషన్ రావణ్ విడుదల కూడా రేపే. ఇది క్రైమ్ థ్రిల్లర్ జానర్. ఇవి కాకుండా ఇంకో రెండు చిన్న సినిమాలు బరిలో ఉన్నాయి కానీ వాటి ఊసే ప్రేక్షకుల్లో లేదు. మరి త్రికోణ యుద్ధంలో ఎవరిది గెలుపవుతుందో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలనుంది. చూద్దాం.
This post was last modified on July 25, 2024 11:15 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…