ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే నంబర్ వన్ దర్శకుడనే పేరు సంపాదించాడు రామ్ గోపాల్ వర్మ. కానీ గత పది పదేహేనేళ్ల నుంచి చెత్త చెత్త సినిమాలు తీస్తూ దర్శకుడిగా పతనం అయిపోయాడు. ఇప్పుడు వేరే దర్శకులను పొగుడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో తన వ్యవహార శైలి వల్ల బాగా నెగెటివిటీ తెచ్చుకున్నప్పటికీ.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాలకు కొందరు విలువనిస్తూ చర్చలు పెడుతుంటారు.
తాజాగా వర్మ వెలిబుచ్చిన ఓ అభిప్రాయం మీద సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రాజమౌళిని వర్మ ఎలా కొనియాడుతుంటాడో తెలిసిందే. ఇటీవలే నెట్ఫ్లిక్స్.. జక్కన్న మీద ఒక డాక్యుమెంటరీ తీసిన నేపథ్యంలో వర్మ ఆయన గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.
రాజమౌళి ఘనతల్ని తెలుగు వారికి ఆపాదించడం కరెక్ట్ కాదని.. ఆయన గుజరాత్లో పుట్టి ఉన్నా దర్శకుడిగా ఇలాగే ఎదిగేవాడని.. ఇలాంటి అద్భుత చిత్రాలే తీసి ప్రపంచ స్థాయికి చేరుకునేవాడని అన్నాడు వర్మ. కానీ ఈ అభిప్రాయంతో మెజారిటీ నెటిజన్లు ఏకీభవించట్లేదు.
తెలుగు వారి సినీ అభిమానమే లేకుంటే.. రాజమౌళి ఈ స్థాయికి ఎదిగేవాడే కాదని అంటున్నారు. మన వాళ్ల సినిమా పిచ్చి వల్లే రాజమౌళి సినిమాలకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆదరణ దక్కిందని.. వారిని మరింతగా సంతృప్తి పరచడానికి తనను తాను మలుచుకుంటూ పెద్ద పెద్ద కలలు కంటూ ఎదిగాడని.. ఆయన్ని ఇన్స్పైర్ చేసింది తెలుగు ప్రేక్షకుల వల్లమాలిన అభిమానమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే తెలుగు సినిమా మార్కెట్ పరిధి వల్లే రాజమౌళి సినిమాలకు రీచ్ కూడా పెరిగిందని.. అందువల్లే భారీ బడ్జెట్లలో జక్కన్న అద్భుతమైన సినిమాలు తీసి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లగలిగాడని.. ఆయన గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఉంటే చిన్న స్థాయిలో ఏవో రీజనల్ సినిమాలు చేసుకుంటూ ఉండిపోయేవాడని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on July 25, 2024 6:55 am
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…