ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలకృష్ణ దాని తర్వాత బోయపాటి శీనుతో అఖండ 2ని అధికారికంగా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటించనప్పటికీ విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇదేనని తెలిసింది. భారీ బడ్జెట్ తో 14 రీల్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం ఎవరనే దాని గురించి ఇప్పటిదాకా సరైన సమాచారం లేదు. తమనే ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఈసారి మార్చే ఆలోచన సీరియస్ గానే జరుగుతోందట. ఎందుకంటే తమన్ బాలయ్యతో వరసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎన్బికె 109 చేశాడు.
ఇప్పుడు వరసగా అయిదోది సమాజనం కాదని యూనిట్ భావిస్తోందట. అందుకే యానిమల్ తో దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ దృష్టిలో హర్షవర్ధన్ రామేశ్వర్ ని మొదటి ఆప్షన్ గా చూస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. హీరోయిజం ఉన్న సీన్లను ఎలివేట్ చేయడంలో ఇతనికితనే సాటి. అర్జున్ రెడ్డిలోనూ ఇది ఋజువయ్యింది. కాకపోతే స్టార్ హీరోల అవకాశాలు రాక కొంత వెనుకబడ్డాడు. కానీ యానిమల్ తో తానేంటో రుజువు చేసుకోవడంతో క్రమంగా స్టార్ హీరోలు తన వైపు చూస్తున్నారు. వాటిలో భాగంగానే బాలయ్య 110 వచ్చిండొచ్చు.
ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదనే సామెతను కూడా మర్చిపోకూడదు. అఘోరా పాత్రను ఎక్కువ హైలైట్ చేస్తూ అఖండ 2 స్క్రిప్ట్ ని అంచనాలకు మించి బోయపాటి శీను సిద్ధం చేశారట. క్యాస్టింగ్ తదితర పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకో రెండు నెలల వరకు బాలయ్య బిజీగా ఉండటంతో ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కాంబో కావడంతో ప్రాజెక్టు మీద బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
This post was last modified on July 24, 2024 11:41 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…