ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలకృష్ణ దాని తర్వాత బోయపాటి శీనుతో అఖండ 2ని అధికారికంగా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటించనప్పటికీ విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇదేనని తెలిసింది. భారీ బడ్జెట్ తో 14 రీల్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం ఎవరనే దాని గురించి ఇప్పటిదాకా సరైన సమాచారం లేదు. తమనే ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఈసారి మార్చే ఆలోచన సీరియస్ గానే జరుగుతోందట. ఎందుకంటే తమన్ బాలయ్యతో వరసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎన్బికె 109 చేశాడు.
ఇప్పుడు వరసగా అయిదోది సమాజనం కాదని యూనిట్ భావిస్తోందట. అందుకే యానిమల్ తో దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ దృష్టిలో హర్షవర్ధన్ రామేశ్వర్ ని మొదటి ఆప్షన్ గా చూస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. హీరోయిజం ఉన్న సీన్లను ఎలివేట్ చేయడంలో ఇతనికితనే సాటి. అర్జున్ రెడ్డిలోనూ ఇది ఋజువయ్యింది. కాకపోతే స్టార్ హీరోల అవకాశాలు రాక కొంత వెనుకబడ్డాడు. కానీ యానిమల్ తో తానేంటో రుజువు చేసుకోవడంతో క్రమంగా స్టార్ హీరోలు తన వైపు చూస్తున్నారు. వాటిలో భాగంగానే బాలయ్య 110 వచ్చిండొచ్చు.
ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదనే సామెతను కూడా మర్చిపోకూడదు. అఘోరా పాత్రను ఎక్కువ హైలైట్ చేస్తూ అఖండ 2 స్క్రిప్ట్ ని అంచనాలకు మించి బోయపాటి శీను సిద్ధం చేశారట. క్యాస్టింగ్ తదితర పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకో రెండు నెలల వరకు బాలయ్య బిజీగా ఉండటంతో ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కాంబో కావడంతో ప్రాజెక్టు మీద బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
This post was last modified on July 24, 2024 11:41 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…