ఆ భాష, ఈ భాష అని తేడా లేదు. అన్ని భాషల్లోనూ రీమేక్ సినిమాల జోరు నడుస్తోంది. ఒకప్పటితో పోలిస్తే భాషల మధ్య అంతరం చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్నప్పటికీ.. రీమేక్ సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోతున్నప్పటికీ… వాటి మీద మోజేమీ తగ్గిపోవట్లేదు. తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒకటికి రెండు రీమేక్లను లైన్లో పెడితే.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రీమేక్తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
విక్టరీ వెంకటేష్ సైతం రీమేక్ సినిమాలో నటిస్తుండగా.. ఇంకొందరు హీరోలు కూడా రీమేక్ల్లో నటిస్తున్నారు. యువ కథానాయకుడు నితిన్ చాలా కాలం తర్వాత ఓ రీమేక్ సినిమాలో నటించనున్నాడు. అదే.. అందాదున్. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ ఆల్రెడీ ‘భీష్మ’ హిట్తో ఊపులో ఉండగా.. తమన్నా, నభా నటేష్ లాంటి హాట్ భామలు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.
ఐతే ‘అందాదున్’ తెలుగు రీమేక్ పట్టాలెక్కే సమయానికే తమిళంలో సైతం రీమేక్ మొదలు కాబోతుండటం విశేషం. ఐతే అందులో నటించబోయే హీరో పేరు వింటే నిరుత్సాహం కలగక మానదు. ఒకప్పుడు ‘జీన్స్’ సహా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో హీరో అట. అతను హీరోగా ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లయింది. అక్కడి జనాలు అతణ్ని పట్టించుకోవడమే మానేశారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా అదరగొట్టిన రోల్లో ఎవరైనా యువ నటుడు నటిస్తే బాగుంటుంది కానీ.. పూర్తిగా ఫామ్ కోల్పోయి, పాతబడిపోయిన ప్రశాంత్ అందులో హీరోగా నటించడమేంటో అర్థం కావడం లేదు. ఈ విషయమై తమిళ జనాల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది.
‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్బస్టర్ తీసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ముందు మోహన్ తీసిన సినిమాలు చాలా వరకు రీమేక్లే. తెలుగులో బ్లాక్బస్టర్లయిన జయం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలను తమ్ముడు రవితో అతను రీమేక్ చేశాడు. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ రీమేక్ను హ్యాండిల్ చేయబోతున్నాడు.
This post was last modified on September 25, 2020 11:10 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…