ఈ ప్రశ్నను ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులు పదే పదే వేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నాడు. ఇటు చూస్తేనేమో సెప్టెంబర్ 27 విడుదల తేదీ ప్రకటించి కూర్చున్న దేవరకు సంబంధించిన వర్క్ ఇంకా ఉంది. రెండో లిరికల్ సాంగ్ తన వల్లే లేట్ అవుతోందని యూనిట్ టాక్. లేకపోతే ఈపాటికి రిలీజ్ చేసి ఉండేవాళ్ళని సమాచారం. షూట్ అయ్యాక ఫైనల్ కాపీ సిద్ధం చేసి ఇస్తే రీ రికార్డింగ్ కి ఎంత టైం తీసుకుంటాడోననే టెన్షన్ తారక్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఫియర్ సాంగ్ ఛార్ట్ బస్టర్ అయ్యాక ప్రతిదీ అంతకు మించి ఆశిస్తున్నారు.
కొరటాల శివ ఈసారి బీజీఎమ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆచార్య విషయంలో వచ్చిన నెగటివిటిలో ఇది కూడా ప్రధాన అంశం అయ్యింది కానీ ఈసారి క్వాలిటీపరంగా రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నారట. మరి అనిరుధ్ ఎంత వేగంగా నాణ్యతతో ఇస్తాడానేది ఇచ్చే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండో వ్యక్తి గౌతమ్ తిన్ననూరి. కొత్తవాళ్ళతో సితార బ్యానర్ లో తీసిన మేజిక్ సినిమా ఎడిటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉందట. దీనికి అనిరుధ్ సంగీతం ఇవ్వాలి. విజయ్ దేవరకొండ 12తో పాటు దీన్ని కంబైన్డ్ ప్యాకేజీగా తనను తీసుకున్నారు. ఇప్పుడదే సమస్య అయ్యింది.
ఇక కాసేపు తమిళం సంగతి చూస్తే ఇండియన్ 3, అజిత్ విదామయార్చి, విగ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రజనీకాంత్ వెట్టయాన్ మీద ఒకేసారి పని చేస్తున్నాడు అనిరుధ్. ఏదీ పక్కనపెట్టలేని, వాయిదా వేయలేని పరిస్థితి. ఇంకోవైపు కూలి కంపోజింగ్ చేయమని లోకేష్ కనగరాజ్ ఒత్తిడి చేస్తున్నాడట. చెన్నై దాటి బయట కాలు పెట్టేందుకు లేకుండా పోతోందని అతని సన్నిహితులు అంటున్నారు. మరి దేవర, మేజిక్ కోసం ఎప్పుడు టైం ఇస్తాడనేది వేచి చూడాలి. ఇండియన్ 2లో తన పనితనం మీద వచ్చిన విమర్శలకు అనిరుధ్ కొంత డిస్టర్బ్ అయ్యాడని వినికిడి.
This post was last modified on July 23, 2024 5:26 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…