ఈ ప్రశ్నను ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులు పదే పదే వేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నాడు. ఇటు చూస్తేనేమో సెప్టెంబర్ 27 విడుదల తేదీ ప్రకటించి కూర్చున్న దేవరకు సంబంధించిన వర్క్ ఇంకా ఉంది. రెండో లిరికల్ సాంగ్ తన వల్లే లేట్ అవుతోందని యూనిట్ టాక్. లేకపోతే ఈపాటికి రిలీజ్ చేసి ఉండేవాళ్ళని సమాచారం. షూట్ అయ్యాక ఫైనల్ కాపీ సిద్ధం చేసి ఇస్తే రీ రికార్డింగ్ కి ఎంత టైం తీసుకుంటాడోననే టెన్షన్ తారక్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఫియర్ సాంగ్ ఛార్ట్ బస్టర్ అయ్యాక ప్రతిదీ అంతకు మించి ఆశిస్తున్నారు.
కొరటాల శివ ఈసారి బీజీఎమ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆచార్య విషయంలో వచ్చిన నెగటివిటిలో ఇది కూడా ప్రధాన అంశం అయ్యింది కానీ ఈసారి క్వాలిటీపరంగా రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నారట. మరి అనిరుధ్ ఎంత వేగంగా నాణ్యతతో ఇస్తాడానేది ఇచ్చే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండో వ్యక్తి గౌతమ్ తిన్ననూరి. కొత్తవాళ్ళతో సితార బ్యానర్ లో తీసిన మేజిక్ సినిమా ఎడిటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉందట. దీనికి అనిరుధ్ సంగీతం ఇవ్వాలి. విజయ్ దేవరకొండ 12తో పాటు దీన్ని కంబైన్డ్ ప్యాకేజీగా తనను తీసుకున్నారు. ఇప్పుడదే సమస్య అయ్యింది.
ఇక కాసేపు తమిళం సంగతి చూస్తే ఇండియన్ 3, అజిత్ విదామయార్చి, విగ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రజనీకాంత్ వెట్టయాన్ మీద ఒకేసారి పని చేస్తున్నాడు అనిరుధ్. ఏదీ పక్కనపెట్టలేని, వాయిదా వేయలేని పరిస్థితి. ఇంకోవైపు కూలి కంపోజింగ్ చేయమని లోకేష్ కనగరాజ్ ఒత్తిడి చేస్తున్నాడట. చెన్నై దాటి బయట కాలు పెట్టేందుకు లేకుండా పోతోందని అతని సన్నిహితులు అంటున్నారు. మరి దేవర, మేజిక్ కోసం ఎప్పుడు టైం ఇస్తాడనేది వేచి చూడాలి. ఇండియన్ 2లో తన పనితనం మీద వచ్చిన విమర్శలకు అనిరుధ్ కొంత డిస్టర్బ్ అయ్యాడని వినికిడి.
This post was last modified on July 23, 2024 5:26 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…