ఆలు లేదు చూలు లేదు సామెత స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రచారానికి సరిగ్గా సరిపోతుంది. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తయ్యాక ఏ మూవీ చేస్తాడనే స్పష్టత ఇప్పటిదాకా లేకపోయినా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రమే ఉంటుందని నమ్మకమైన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అధికారికంగా ప్రకటించే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గురించి జరుగుతున్న ప్రచారం, ఒకటి కాదు ఏకంగా రెండు పేర్లు చక్కర్లు కొట్టడం అయోమయానికి గురి చేస్తోంది.
మొదటి అమ్మాయి పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీకి చెందిన ఈ డాన్సర్ కం కొరియోగ్రాఫర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీలో పుట్టి పెరిగి ఎంబీఏ చదివి అమెరికాలోనూ నృత్యానికి సంబంధించిన శిక్షణ తీసుకుంది. మ్యూజిక్ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఈమె సుపరిచితురాలు. 2012లో యూట్యూబ్ ఛానల్ పెట్టి కనిష్టంగా మూడు నుంచి అయిదు లక్షల నెలసరి ఆదాయం అందుకుంటున్న సెలెబ్రిటిగా పేరుంది. పలు బ్రాండ్లకు సైతం పని చేసింది. ఈమెను ఇన్స్ టాలో హను రాఘవపూడి ఫాలో అవుతున్నారట. ఇక రెండో ఆప్షన్ చూద్దాం.
ఆమె పేరు సజల్ ఆలీ. శ్రీదేవి మామ్ లో నటించాక పేరు వచ్చింది. పాకిస్థాన్ కు చెందిన ఈ మోడల్ కు 10 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అభిమానులు భారీగా పెరుగుతున్నారు. ఇద్దరూ ముస్లిం యువతులు కావడం గమనార్హం. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాని సీతారామం లాగా ప్రేమకథగా కాకుండా యాక్షన్ డ్రామాగా హను రాఘవపూడి చెప్పబోతున్నట్టు సమాచారం. అఫీషియల్ గా ఏదీ చెప్పకుండానే ఇంత చర్చ జరుగుతోందంటే అది ప్రభాస్ మహాత్యమే. అసలు వీళ్లిద్దరూ కాకుండా హఠాత్తుగా మూడో పేరు తెరమీదకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 22, 2024 10:39 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…