ఆలు లేదు చూలు లేదు సామెత స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రచారానికి సరిగ్గా సరిపోతుంది. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తయ్యాక ఏ మూవీ చేస్తాడనే స్పష్టత ఇప్పటిదాకా లేకపోయినా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రమే ఉంటుందని నమ్మకమైన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అధికారికంగా ప్రకటించే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గురించి జరుగుతున్న ప్రచారం, ఒకటి కాదు ఏకంగా రెండు పేర్లు చక్కర్లు కొట్టడం అయోమయానికి గురి చేస్తోంది.
మొదటి అమ్మాయి పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీకి చెందిన ఈ డాన్సర్ కం కొరియోగ్రాఫర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీలో పుట్టి పెరిగి ఎంబీఏ చదివి అమెరికాలోనూ నృత్యానికి సంబంధించిన శిక్షణ తీసుకుంది. మ్యూజిక్ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఈమె సుపరిచితురాలు. 2012లో యూట్యూబ్ ఛానల్ పెట్టి కనిష్టంగా మూడు నుంచి అయిదు లక్షల నెలసరి ఆదాయం అందుకుంటున్న సెలెబ్రిటిగా పేరుంది. పలు బ్రాండ్లకు సైతం పని చేసింది. ఈమెను ఇన్స్ టాలో హను రాఘవపూడి ఫాలో అవుతున్నారట. ఇక రెండో ఆప్షన్ చూద్దాం.
ఆమె పేరు సజల్ ఆలీ. శ్రీదేవి మామ్ లో నటించాక పేరు వచ్చింది. పాకిస్థాన్ కు చెందిన ఈ మోడల్ కు 10 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అభిమానులు భారీగా పెరుగుతున్నారు. ఇద్దరూ ముస్లిం యువతులు కావడం గమనార్హం. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాని సీతారామం లాగా ప్రేమకథగా కాకుండా యాక్షన్ డ్రామాగా హను రాఘవపూడి చెప్పబోతున్నట్టు సమాచారం. అఫీషియల్ గా ఏదీ చెప్పకుండానే ఇంత చర్చ జరుగుతోందంటే అది ప్రభాస్ మహాత్యమే. అసలు వీళ్లిద్దరూ కాకుండా హఠాత్తుగా మూడో పేరు తెరమీదకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 22, 2024 10:39 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…