ఆలు లేదు చూలు లేదు సామెత స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రచారానికి సరిగ్గా సరిపోతుంది. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తయ్యాక ఏ మూవీ చేస్తాడనే స్పష్టత ఇప్పటిదాకా లేకపోయినా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రమే ఉంటుందని నమ్మకమైన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అధికారికంగా ప్రకటించే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గురించి జరుగుతున్న ప్రచారం, ఒకటి కాదు ఏకంగా రెండు పేర్లు చక్కర్లు కొట్టడం అయోమయానికి గురి చేస్తోంది.
మొదటి అమ్మాయి పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీకి చెందిన ఈ డాన్సర్ కం కొరియోగ్రాఫర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీలో పుట్టి పెరిగి ఎంబీఏ చదివి అమెరికాలోనూ నృత్యానికి సంబంధించిన శిక్షణ తీసుకుంది. మ్యూజిక్ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఈమె సుపరిచితురాలు. 2012లో యూట్యూబ్ ఛానల్ పెట్టి కనిష్టంగా మూడు నుంచి అయిదు లక్షల నెలసరి ఆదాయం అందుకుంటున్న సెలెబ్రిటిగా పేరుంది. పలు బ్రాండ్లకు సైతం పని చేసింది. ఈమెను ఇన్స్ టాలో హను రాఘవపూడి ఫాలో అవుతున్నారట. ఇక రెండో ఆప్షన్ చూద్దాం.
ఆమె పేరు సజల్ ఆలీ. శ్రీదేవి మామ్ లో నటించాక పేరు వచ్చింది. పాకిస్థాన్ కు చెందిన ఈ మోడల్ కు 10 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అభిమానులు భారీగా పెరుగుతున్నారు. ఇద్దరూ ముస్లిం యువతులు కావడం గమనార్హం. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాని సీతారామం లాగా ప్రేమకథగా కాకుండా యాక్షన్ డ్రామాగా హను రాఘవపూడి చెప్పబోతున్నట్టు సమాచారం. అఫీషియల్ గా ఏదీ చెప్పకుండానే ఇంత చర్చ జరుగుతోందంటే అది ప్రభాస్ మహాత్యమే. అసలు వీళ్లిద్దరూ కాకుండా హఠాత్తుగా మూడో పేరు తెరమీదకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 22, 2024 10:39 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…