సినీ ప్రియుల్లో ఎక్కడ చూసినా ఆగస్ట్ 15 వస్తున్న సినిమాల పోటీ చర్చే జరుగుతోంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్, 35 చిన్న కథ కాదు, తంగలాన్ ఇలా ఏకంగా అయిదు చిత్రాలు నువ్వా నేనాని తలపడుతుండటంతో థియేటర్ల సర్దుబాటు గురించి డిస్ట్రిబ్యూటర్ల మధ్య అప్పుడే హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. హిందీ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మేన్, వేదాలు రిలీజ్ కాబోతున్నాయి. నగరాల మల్టీప్లెక్సుల్లో వీటికి స్క్రీన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇంత హడావిడిలోనూ స్వాతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్ చిత్రం రఘుతాత తగ్గనంటోంది.
కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే ఫిలింస్ నుంచి వస్తున్న రఘు తాతలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. నిన్న చెన్నైలో ఆడియో లాంచ్ చేశారు. నిజానికి ఆగస్ట్ 15 రేస్ నుంచి తప్పుకుంటుందని తొలుత అందరూ భావించారు కానీ అదేమీ లేదట. ఇండిపెండెన్స్ డేకే వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. టీజర్ టైంలో దీని మీద కొంత వివాదం నడిచింది. తమిళనాడులో హిందూ వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని దానికి మహిళా సమస్యకు ముడిపెట్టి దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కించారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని కీర్తి సురేష్ క్లారిటీ ఇస్తోంది.
చూస్తుంటే తెలుగులో రఘు తాత సమాంతరంగా విడుదల కావడం అనుమానంగానే ఉంది. అయితే హోంబాలే బ్యానర్ కాబట్టి బయ్యర్ల మద్దతు ఏమైనా దొరికితే కాసిన్ని థియేటర్లతో సర్దుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే గతంలో శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ లు పోటీ వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాని ఫలితంగా ఒకటి అసలు డబ్బింగ్ రిలీజే కాకపోగా మరొకటి దారుణంగా డిజాస్టరయ్యింది. మరి రఘు తాత లేట్ వస్తానంటాడో లేదో చూడాలి. కీర్తి సురేష్ కున్న ఇమేజ్ దృష్ట్యా సేమ్ టైం రిలీజ్ కోసమే చూస్తున్నారు రఘు తాత నిర్మాతలు.
This post was last modified on July 21, 2024 6:41 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…