Movie News

ఫోన్ పేతో ఈగ విలన్ డిష్యుం డిష్యుం

ఈగ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న కిచ్చ సుదీప్ కు ఫోన్ పే సంస్థతో జగడం వచ్చింది. అదేంటో అర్థం కావాలంటే వివరాల్లోకి వెళ్ళాలి. ఇటీవలే కర్ణాటక సర్కారు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కొలువుల్లో స్థానికులకు పెద్ద పీఠ వేసేలా జిఓ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనిపట్ల ఆ రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఫోన్ పే సిఈఓ సమీర్ నిగమ్ ఈ ప్రతిపాదన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదని, ఉద్యోగానికి కొలమానం ప్రతిభ తప్ప స్థానికత కాదని ఆయన వాదన. ఇదే వివాదానికి దారి తీసింది.

తమ ప్రయోజనాలకు అడ్డు తగిలేలా సమీర్ మాట్లాడ్డం పట్ల కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఫోన్ పేకు బ్రాండ్ అంబాసడర్ గా సుదీప్ ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఆయనపైకి వెళ్ళింది. మాతృభాష, రాష్ట్రం పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శించే సుదీప్ కు ఈ పరిణామం ఆగ్రహం కలిగించింది. దీంతో ప్రజలకు మద్దతు తెలుపుతూ ఫోన్ పేకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. ఒకవేళ సదరు కంపెనీ నుంచి క్షమాపణ రాని పక్షంలో ఇకపై ఆ సంస్థకు పని చేయనని చెప్పబోతున్నట్టు బెంగళూరు టాక్. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో ప్రకటన లేదా ప్రెస్ మీట్ జరగొచ్చట.

ఇదే కాదు ఓటిటి, సినిమా టికెట్ల మీద అదనపు పన్ను విధించే అంశం కూడా కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అమలు చేయలేదు కానీ శాసనసభలో ఆమోదం పొందాక చర్యలు తీసుకుంటారు. సుదీప్ స్పందించిన తీరు పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఇతర నటీనటులు కూడా స్థానికత అంశం మీద సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఫోన్ పేని వాడకూడదంటూ కన్నడిగులు క్యాంపైన్ మొదలుపెట్టి యాప్ తీసేయడం, స్కానర్లను తీసేయడం లాంటివి చేస్తున్నారట. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరగనుందో.

This post was last modified on July 21, 2024 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

9 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

9 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

9 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

11 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

12 hours ago