ఏదైనా ఒక పెద్ద, క్రేజీ సీజన్ వచ్చిందంటే.. సినిమాలు పోటాపోటీగా విడుదలకు రెడీ అయిపోతాయి. సంక్రాంతితో మొదలుపెడితే.. ఇలా క్లాష్ గట్టిగా ఉండే సీజన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. వచ్చే నెలలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం టాలీవుడ్లో అరడజను సినిమాల దాకా రెడీ అవుతుండటం విశేషం.
ఇక ఈ ఏడాదిలో ఎక్కువ పోటీ ఉన్న మరో సీజన్ అంటే డిసెంబరే. ఆ నెలలో సినిమాలకు బాగానే అనుకూలంగా ఉంటుంది. క్రిస్మస్ సెలవుల్లోనే కాక ముందు వెనుక వారాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు రిలీజవుతుంటాయి.
ఈసారి డిసెంబరులో క్రేజీ క్లాష్ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డిసెంబరు 6కు పుష్ప-2 ఫిక్సయింది. ఆ సినిమా వాయిదా పడుతుందన్నారు కానీ.. అలాంటిదేమీ లేదని టీం స్పష్టం చేసింది ఇటీవలే. కాబట్టి పుష్ప-2 డిసెంబరు 6న రావడం పక్కా.
మరోవైపు క్రిస్మస్ వీకెండ్ కోసం నాగచైతన్య మూవీ తండేల్తో పాటు నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఫిక్సయ్యాయి. ఇంతలోనే మంచు విష్ణు సినిమా కన్నప్ప డిసెంబరు రేసులోకి వచ్చింది. అందులో ప్రభాస్తో పాటు భారీ తారాగణం ఉండడం, పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ టైంలో బాగానే హడావుడి ఉంటుంది.
ఈ నాలుగు సినిమాలకు డిసెంబరులో థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం అనుకుంటుంటే.. దసరా లేదా దీపావళి టైంలో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, బాలయ్య-బాబీ సినిమాలను కూడా డిసెంబరులో రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్కు కూడా టైం పడుతుంది.
కాబట్టి దసరా లేదా దీపావళికి రిలీజ్ కష్టమే. సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు ఫుల్ అయిపోయాయి. కాబట్టి డిసెంబరులో రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. మరి అరడజను క్రేజీ సినిమాలకు డిసెంబరులో డేట్లు, థియేటర్లు సర్దుబాటు చేయడం అంటే తలనొప్పి తప్పదన్నట్లే.
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…