ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న సమంతా తిరిగి ఎప్పుడు తెరమీద కనిపిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య స్వంత నిర్మాణంలో మా ఇంటి బంగారం ప్రకటించి చిన్న పోస్టర్ వదిలింది తప్ప అంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి కథలు వింటున్న సామ్ చేతికి ఒక ఇంటరెస్టింగ్ కాంబో వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డికె త్వరలో రక్త్ భ్రమండ్ పేరుతో ఒక హారర్ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. దర్శకత్వం వీళ్ళు చేయడం లేదు.
2018లో తుంబాడ్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రహి అనిల్ భర్వేకి డైరెక్షన్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇది నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోతున్నారు. వచ్చే ఏడాది 2025 ఆగస్ట్ స్ట్రీమింగ్ టార్గెట్ గా పెట్టుకుని నిర్మాణం చేస్తారని తెలిసింది. భారీ బడ్జెట్ తో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని బ్యాక్ డ్రాప్ ని ఇందులో పరిచయం చేస్తారు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో పాటు ఊహకందని మలుపులతో ఒక కొత్త అనుభూతిని రక్త్ భ్రమండ్ ఇస్తుందని యూనిట్ టాక్. సమంతాతో పాటు సిద్దార్థ్ రాయ్ కపూర్, వామికా గబ్బిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
టైటిల్ తోనే భయపెట్టడం చూస్తుంటే కంటెంట్ నిజంగానే షాకింగ్ గా ఉండేలా కనిపిస్తోంది. రాజ్ అండ్ డీకేలు తెలుగు వాళ్లే అయినప్పటికీ ఇండియన్ ఓటిటి స్పేస్ లో తమదైన జెండా ఎగరేస్తున్నారు. సామ్ తోనే తీసిన సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గన్స్ అండ్ గులాబ్స్ కు వచ్చిన స్పందన చూసి నెట్ ఫ్లిక్స్ ఈ దర్శక ద్వయాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రైమ్ కోసం ఫ్యామిలీ మ్యాన్ 3 తీస్తున్న రాజ్ అండ్ డీకే మరోపక్క ఇతర సిరీస్ ల ప్రొడక్షన్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. రక్త్ భ్రమండ్ లో సమంతా పాత్ర తీరుతెన్నులు కెరీర్ బెస్ట్ అనిపించేలా ఉంటాయట.
This post was last modified on July 20, 2024 5:20 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…