ఒక్క థియేటర్లో ఓ సినిమా కోటి రూపాయల గ్రాస్ రాబడితే కొన్నేళ్ల ముందు వరకు గొప్పగాచెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది పెద్ద సినిమాలకు ఈజీ మార్క్ అయిపోయింది. మల్టీప్లెక్సుల్లో అయితే ఒకే సినిమా రెండు కోట్ల వసూళ్ల మార్కును కూడా దాటేస్తోంది. ఇప్పుడు కల్కి సినిమా హైదరాబాద్లోని ఫేమస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్లో సాధించిన ఘనత చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అక్కడ ఈ సినిమాను లక్ష మందికి పైగా చూడడం విశేషం.
తాజాగా ఈ మల్టీప్లెక్స్లో లక్ష ఫుట్ ఫాల్స్ మైలురాయిని కల్కి సినిమా దాటేసింది. ఇప్పటిదాకా ఈ మల్టీప్లెక్స్లో రికార్డు ఆర్ఆర్ఆర్ మూవీదే. అక్కడ 99 వేల మందికి పైగా ఈ సినిమాను చూశారు. ఆ రికార్డును కల్కి అధిగమించింది. విడుదలైన 23వ రోజుకే కల్కి ఈ ఘనత సాధించింది.
నాలుగో వీకెండ్లో కూడా కల్కి సినిమా బాగా ఆడుతోంది. తర్వాతి వారాల్లో వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడం కల్కికి కలిసి వచ్చింది. ఈ వారం కూడా కల్కికి ఎదురు లేనట్లే వీకెండ్లో మంచి ఆక్యుపెన్సీలతో సినిమా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏఎంబీలో కల్కి ఫుట్ ఫాల్స్ ఇంకా పెరగబోతున్నట్లే. ఇప్పట్లో ఆ సినిమా రికార్డును ఏ చిత్రం అధిగమించకపోవచ్చు.
ఏఎంబీలో కల్కి సినిమా నాన్ త్రీడీ వెర్షన్ ప్రస్తుతం 295 రేటుతో నడుస్తోంది. తొలి వారం ఉన్న రేట్లను బట్టి చూస్తే ఆ సినిమా అక్కడ మూడున్నర కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఒక్క మల్టీప్లెక్సులో ఇంత వసూళ్లంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే కల్కి ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటేసిన సంగతి తెలిసిందే. ఫుల్ రన్ అయ్యేసరికి వసూళ్లు రూ.1100 మార్కును టచ్ చేయొచ్చు.
This post was last modified on July 20, 2024 12:01 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…