యానిమల్ లో బోల్డ్ గా నటించడం ద్వారా మన ప్రేక్షకులకూ కనెక్ట్ అయిపోయిన హీరోయిన్ త్రిప్తి డిమ్రి పేరు మీద ఎక్కువ మార్కెటింగ్ జరిగిన సినిమా బ్యాడ్ న్యూజ్ ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. బాలీవుడ్ బాక్సాఫీస్ కు గత కొన్ని నెలలుగా కల్కి 2898 ఏడి తప్ప అంతగా జోష్ ఇచ్చిన మూవీ ఏదీ లేదు. అందుకే ఈ చిత్రం మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. మల్టీప్లెక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ముందు రోజే యాభై వేల టికెట్లకు అమ్ముడుపోవడం ఆడియన్స్ కి దీని మీద ఉన్న ఆసక్తిని తేటతెల్లం చేసింది. విచిత్రమైన పాయింట్ తో తెరకెక్కించిన బ్యాడ్ న్యూజ్ ఎలా ఉందో చూద్దాం.
వంటలు చేసే చెఫ్ గా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సలోని (త్రిప్తి డిమ్రి) ఇంట్లో వాళ్ళ పోరు పడలేక చిన్న దుకాణం నడుపుకునే అఖిల్ చద్దా (విక్కీ కౌశల్) ని పెళ్లి చేసుకుంటుంది. అయితే హానీమూన్ లోనే గొడవలు వచ్చి విడాకుల దాకా వెళ్తారు. వృత్తిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోనికి అక్కడ గుర్బీర్ పన్ను (అమీ విర్క్ )కు దగ్గరవుతుంది. ఆ సమయంలో ప్రెగ్నెంట్ అయితే అఖిల్, గుర్బీర్ కు సంబంధించిన కవలలు గర్భంలో ఉన్నారని డాక్టర్లు చెబుతారు. దీంతో తండ్రులిద్దరూ రంగంలోకి దిగాక జరిగే పరిణామాలే బ్యాడ్ న్యూజ్ స్టోరీ.
దర్శకుడు ఆనంద్ తివారి తీసుకున్న కాన్సెప్ట్ సంక్లిష్టంగా ఉన్నా నవ్వించడమే ప్రధానంగా ట్రీట్ మెంట్ రాసుకున్నాడు. అయితే బలమైన కథనం, సన్నివేశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో బ్యాడ్ న్యూజ్ ఎంటర్ టైన్ చేయదు. ముఖ్యంగా సెకండాఫ్ లో విక్కీ కౌశల్, అమీ విర్క్ లు కలుసుకున్నాక జరిగే ఎపిసోడ్లను అవసరానికి మించి సాగదీశారు. ఇక్కడ సీన్లు రిపీట్ అనిపించి ఒకదశ తర్వాత బోర్ కొట్టేస్తాయి. విక్కీ తన భుజాల మీదే అధిక భారం మోశాడు. యాక్టింగ్ పరంగా త్రిప్తి డిమ్రి ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. బాలీవుడ్ జనాలకు నచ్చవచ్చేమో కానీ మనకీ బ్యాడ్ న్యూజ్ ఒంటబట్టడం డౌటే.
This post was last modified on July 19, 2024 8:51 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…