బాలీవుడ్ విలక్షణ నటుల్లో ప్రముఖంగా వినిపించే పేరు నవాజుద్దీన్ సిద్ధిక్. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో జైల్లో దెబ్బలు తినే ఒక మాములు గూండా క్యారెక్టర్ దగ్గరి నుంచి స్టార్ డైరెక్టర్లు కోరిమరీ పిలిపించుకునే స్థాయికి చేరుకున్నాడు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంలో అతనికి అతనే సాటి. అయితే తాజాగా తను చేసిన కామెంట్స్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. సౌత్ సినిమాల్లో తాను కేవలం ఎక్కువ పారితోషికం ఇస్తారని చేశానని, సూపర్ స్టార్ రజనీకాంత్ పేట అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి బాంబు పేల్చాడు. ఈ విషయంలో తనకు గిల్టీగా కూడా ఉందని ఒప్పుకున్నాడు.
నిజానికి వెంకటేష్ సైంధవ్ ని బాగా గమనిస్తే నవాజుద్దీన్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. భాష రాని ఇబ్బందితో పాటు తెచ్చి పెట్టుకున్న నటన స్పష్టంగా కనిపిస్తుంది. తను అదే అంటున్నాడు. ఏదో పేపర్ తీసుకుని బట్టి పట్టి యాడ్ ఫిలిం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుందని, ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయకపోతే అసలు వచ్చే వాడినే కాదనే రీతిలో అతను మాట్లాడ్డం షాక్ కలిగించేదే. అసలు బాలీవుడ్ విలన్లు మనకు కొత్త కాదు. అమ్రిష్ పూరి, సురేష్ ఒబెరాయ్ కాలం నుంచి ఇప్పటి బాబీ డియోల్, అర్జున్ రామ్ పాల్ దాకా ఎందరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాలు పంచుకున్నారు.
కానీ ఇంత ఓపెన్ గా నవాజుద్దీన్ లాగా బయట పడిన వాళ్ళు లేరు. లాంగ్వేజ్ మీద పట్టు సాధించకపోవడం పట్ల సిగ్గు పడుతున్నానని చెబుతున్న ఈ వర్సటైల్ యాక్టర్ ఇకపై మారేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. మంచిదే. విలన్ల కొరత తీవ్రంగా ఉన్న టాలీవుడ్ లో నవాజుద్దీన్ లాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తే మంచి కెరీర్ దక్కతుంది. సైంధవ్ ఆడలేదు కానీ అది కనక సూపర్ హిట్ అయ్యుంటే మరిన్ని అవకాశాలు క్యూ కట్టేవి. వరస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న నవాజుద్దీన్ సిద్ధిక్ వీలైనంత త్వరలో తెలుగులో మరో క్రేజీ మూవీలో భాగమైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…