తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న లెజెండరీ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. తొలి సినిమా ‘గులాబి’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, మురారి, చందమామ లాంటి క్లాసిక్స్ అందించాడు. కానీ చాలామంది దిగ్గజ దర్శకుల్లాగే ఒక దశ తర్వాత ఆయన కూడా రేసులో వెనుకబడిపోయారు. ఒకే రకం సినిమాలు తీసి విసిగించేశారు.
ఐతే కృష్ణవంశీ కెరీర్ ఏమాత్రం బాగా లేని సమయంలో రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం దక్కింది. అప్పుడాయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘గోవిందుడు అందరి వాడేలే’ అంచనాలను అందుకోలేకపోయింది. అది కృష్ణవంశీ స్థాయికి ఏమాత్రం తగని సినిమా అనడంలో సందేహం లేదు.
స్లంప్లో ఉన్న కృష్ణవంశీకి చరణ్ లాంటి టాప్ స్టార్ ఛాన్స్ ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడని మెగా అభిమానులు ఫీలయ్యారు. ఆ సినిమా తర్వాత కృష్ణవంశీ కెరీర్ మరింత డౌన్ అయింది. తర్వాత ఆయన్నుంచి వచ్చిన నక్షత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ‘రంగ మార్తాండ’ కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు చేతిలో సినిమా లేక ఇబ్బంది పడుతున్నాడు కృష్ణవంశీ.
ఐతే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న కృష్ణవంశీకి.. ఒక మెగా అభిమాని ఓ రిక్వెస్ట్ చేశాడు. రామ్ చరణ్తో ఒక మెమొరబుల్ మూవీ తీయమని అడిగాడు. అందుకు కృష్ణవంశీ బదులిస్తూ తన దగ్గరో సూపర్ ఐడియా ఉందని, స్క్రిప్టు కూడా రెడీగా ఉందని.. చరణ్ టైం ఇవ్వడమే ఆలస్యం సినిమా చేస్తానని అన్నాడు. కానీ ఇంతకుముందు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ను కృష్ణవంశీ వృథా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్ వచ్చి సినిమా చేయడమంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ కాంబినేషన్ ఓకే అయితే మెగా అభిమానులే సానుకూలంగా స్పందించకపోవచ్చు.
This post was last modified on July 19, 2024 9:51 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…