తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ‘రాజీనామా’ యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో రైతు రుణమాఫీ రూ.2 లక్షల వరకు చేస్తానని చెప్పి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ చేయలేదని.. గతంలో హరీష్ రావు ప్రస్తావించారు. రైతు రుణ మాఫీ చేసి.. మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అంటూ.. రేవంత్పై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే అటు కాంగ్రెస్ నేతలు కూడా మాటలు పేల్చారు. ఇది సవాళ్లకు దారి తీసింది.
రైతు రుణ మాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిచేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి(సిద్దిపేట) రాజీనామా చేస్తానని హరీష్ రావే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రుణ మాఫీపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పాసు బుక్కులు ఉన్న ప్రతి ఒక్కరికీ.. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నట్టు స్వయంగా రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు కూడా ఉండబోవన్నారు. అందరికీ రుణ మాఫీ వర్తిస్తుందని తెలిపారు.
అయితే.. మరోసారి హరీష్రావును సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూ.. రైతులకు రుణమాఫీ చేస్తున్నామని.. అయినప్పటికీ.. ఎవరో నాయకులను(హరీష్రావు) తాము రాజీనామా చేయమని అడగబోమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కూడా చెప్పారు. ఎలానూ వారు ఎలాంటి సవాల్కు నిలబడరని.. తప్పించుకుని పారిపోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తొలి విడతలతో రూ.లక్ష లోపు రుణాలు ఉన్న అన్నదాతలకు ఉపశమనం కల్పిస్తూ.. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో హరీష్ రావును ఉద్దేశించి.. రేవంత్ వ్యాఖ్యలు గుప్పించారు. “గాంధీ కుటుంబం బూటకపు మాటలు చెప్పదు” అని వ్యాఖ్యానించారు. అందుకే ఇచ్చిన హామీ మేరకు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రుణ మాఫీ చేసి తీరుతున్నామని చెప్పారు. అయితే.. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై.. హరీష్రావు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ తాను మాటపైనే నిలబడి ఉన్నానని చెప్పారు.
రూ.2 లక్షల రుణ మాఫీని ఆగస్టు 15 నాటికి చేస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అయితే.. ఇదేసమయంలో తాజాగా మరో షరతు కూడా తెరమీదికి తెచ్చారు. అదే ఆగస్టు 15 నాటికి ‘ఆరు గ్యారెంటీ’లను అమలు చేయాలని అన్నారు. అప్పుడు తాను ఎన్ని సార్లయినా.. రాజీనామా చేసేందుకు రెడీనేనని హరీష్రావు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం రుణ మాఫీకి ఇప్పుడు రూ.10 వేల కోట్లు రెడీ చేసుకుంది. మరో 8 వేల కోట్లు అవసరం అవుతారని.. అధికారులు చెప్పారు. దీనిని తీసుకురావడం .. రేవంత్ వల్ల కాదని హరీష్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…