గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ ‘పుష్ప-2’ సినిమా చుట్టూనే తిరుగుతన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. దర్శకుడు సుకుమారేమో యుఎస్కు వెళ్లిపోతే, హీరో అల్లు అర్జునేమో ఇంకేదో దేశానికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లిపోయాడని.. దీంతో షూట్ సంగతి ఎటూ తేలకుండా తయారైందని.. డిసెంబరు 6కు కూడా సినిమా విడుదల కావడం కష్టమే అని ప్రచారం సాగింది.
ఐతే యూనిట్లో పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఏమీ లేవని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన కూతురి చదువుకు సంబంధించి కుటుంబంతో కలిసి యుఎస్ వెళ్లాడు తప్ప వేరే కారణం లేదని.. తనకు కొంచెం బ్రేక్ దొరకడంతోనే బన్నీ గడ్డం తీసి ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లాడని అంటున్నారు. ఐతే సుకుమార్ ఆల్రెడీ హైదరాబాద్లో అడుగు పెట్టేయగా.. చిత్రీకరణ కూడా మరి కొన్ని రోజుల్లో పున:ప్రారంభం కాబోతోందని కూడా చెబుతున్నారు. కానీ బన్నీ పునరాగమనం ఎప్పుడన్న దాని మీదే సస్పెన్స్ నెలకొంది.
సుకుమార్ తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టినా.. గడ్డం ట్రిమ్ చేసి కనిపిస్తున్న బన్నీతో కంటిన్యుటీ సీన్లు తీయడం ఎలా అనే చర్చ మొదలైంది. కానీ యూనిట్ వర్గాల సమాచారం ఏంటంటే.. బన్నీ వెంటనే పుష్ప-2 సెట్లోకి అడుగు పెట్టబోడట. కొన్ని వారాలు విరామం తీసుకుంటున్నాడట.
సినిమాలో బన్నీకి సంబంధించి చిత్రీకరణ మిగిలి ఉన్నది క్లైమాక్స్ ఫైట్, ఒక పాట మాత్రమేనట. అతను తిరిగొచ్చేలోపు బన్నీతో సంబంధం లేని సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరించనున్నాడట. బన్నీ రాగానే క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి మధ్యలో కొంచెం వీలు చేసుకుని ఐటెం సాంగ్ చిత్రీకరణ సాగిస్తారు. ఇదంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారని.. సినిమా విడుదల తేదీ మారే సమస్యే లేదని.. డిసెంబరు 6కు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప-2 థియేటర్లలోకి దిగుతుందని.. అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on July 19, 2024 9:45 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…