ఇరవై రోజులు దాటుతున్నా కల్కి 2898 ఏడి వార్తల్లో నిలవడం మాత్రం ఆగడం లేదు. వెయ్యి కోట్ల గ్రాస్ దాటేసి క్రమంగా నెమ్మదిస్తుందని అనుకుంటున్న టైంలో ఏదైనా సెలవు రోజు వస్తే చాలు ఒక్కసారిగా బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి. నిన్న మొహరం, తొలి ఏకాదశి సెలవు ఒకేసారి కలిసి రావడంతో ప్రధాన కేంద్రాలన్నీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడాయి. మొదట్లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని భావించిన ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వారం నుంచి అవి తగ్గడంతో థియేటర్లకు వస్తున్నారు. భారతీయుడు 2 దారుణంగా నిరాశ పరచడం కల్కికి దక్కిన మరో వరం. ఇక అసలు విషయం వేరే ఉంది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కల్కి 2898 ఏడి అత్యధిక టికెట్లు అమ్మిన తొలి ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. మూడో వారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో 12.15 మిలియన్ల టికెట్లు సేల్ అయిన మూవీగా నెంబర్ వన్ సింహాసనాన్ని అందుకుంది. ఇప్పటిదాకా ఈ మైలురాయి షారుఖ్ ఖాన్ జవాన్ (12.01) పేరు మీద ఉంది. కల్కి ఫైనల్ రన్ ఇంకా అవ్వలేదు. చాలా ఏరియాలలో స్ట్రాంగ్ గా ఉంది. ఇంకో వారం పది రోజులు మంచి స్పీడ్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. రేపు వచ్చేవి చిన్న సినిమాలు కాబట్టి పోటీ పరంగా ఇబ్బందేమీ ఉండదని అంటున్నారు.
చూస్తుంటే ఇతర హీరోలకు ప్రభాస్ ఏ రికార్డు మిగిలించేలా లేడు. ఒక్కొక్కటిగా అన్నీ తుడిచిపెడుతున్నాడు. సలార్ లాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడే ఆగని డార్లింగ్ బ్లాక్ బస్టర్ వస్తే నిలువరించడం ఎవరి వల్ల అవుతుంది. ఈ లెక్కన బుక్ మై షోలో 15 మిలియన్ టికెట్లు అమ్మిన సినిమాగా కల్కి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టమవుతోంది. దీన్ని క్రాస్ చేయడం మాత్రం అంత సులభంగా కాదనే చెప్పాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ల పాత్రలు, కళ్ళు చెదిరే విజువల్స్ మళ్ళీ ఇంతకు మించి మేజిక్ చూపిస్తేనే కల్కిని దాటొచ్చు.
This post was last modified on July 18, 2024 12:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…