Movie News

వివాదం రేపుతున్న డబల్ ఇస్మార్ట్ సాంగ్ !

ఇటీవల మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నోటి నుండి పాపులర్ అయిన ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అంటూ ఒక వాయిస్ ముందు పెట్టి ఒక పాటను తీసుకువచ్చారు. గుంటూరు కారం ప్రేక్షకులను అలరించలేకపోయినా ఆ పాట మాత్రం భారీ ఎత్తున హిట్ అయింది. దాంతో సోషల్ మీడియాలో అప్పటికే పాపులర్ అయిన ఆ వ్యక్తి మరింత పాపులర్ కావడం జరిగింది.

మరి దానినే స్ఫూర్థిగా తీసుకున్నాడో ఏమోగానీ డబల్ ఇస్మార్ట్ సినిమాలో కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’ అని మీడియా సమావేశాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది. కల్లు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూయించే రంగాలలో ప్రధానమయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో డబల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on July 17, 2024 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

4 minutes ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

22 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

59 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

3 hours ago