ఇటీవల మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నోటి నుండి పాపులర్ అయిన ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అంటూ ఒక వాయిస్ ముందు పెట్టి ఒక పాటను తీసుకువచ్చారు. గుంటూరు కారం ప్రేక్షకులను అలరించలేకపోయినా ఆ పాట మాత్రం భారీ ఎత్తున హిట్ అయింది. దాంతో సోషల్ మీడియాలో అప్పటికే పాపులర్ అయిన ఆ వ్యక్తి మరింత పాపులర్ కావడం జరిగింది.
మరి దానినే స్ఫూర్థిగా తీసుకున్నాడో ఏమోగానీ డబల్ ఇస్మార్ట్ సినిమాలో కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’ అని మీడియా సమావేశాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది. కల్లు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూయించే రంగాలలో ప్రధానమయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో డబల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 17, 2024 11:35 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…