అఖిల్ కెరీర్ లోనే ఏజెంట్ అతి పెద్ద డిజాస్టర్ అవ్వొచ్చుగాక. కానీ థియేటర్లలో చూడని వాళ్ళు ఎందరో ఉంటారు. బాలేకపోయినా పర్లేదు ఓసారి టీవీ లేదా మొబైల్ లో చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. అయినా సరే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటిదాకా ఓటిటి స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. ఇంకోవైపు దీని హిందీ డబ్బింగ్ వెర్షన్ ని గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్ ఈ నెల 28 ప్రసారం చేయబోతున్నట్టు యాడ్స్ తో హోరెత్తిస్తోంది. ఇది చూసిన అఖిల్ అభిమానులు అనువాదం తప్ప ఒరిజినల్ చూస్ ఛాన్స్ లేదాని బాధపడుతున్నారు. కానీ ఇది ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ తెలుగు హక్కులను సోని లివ్ కి ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా అయ్యింది. తర్వాత బయట డిస్ట్రిబ్యూటర్ తో ఫైనాన్స్ కి సంబంధించిన ఏదో వివాదం వల్ల బ్రేక్ పడింది. తర్వాత ఆ కేసు ముందుకు వెళ్లిన దాఖలాలు కూడా కనిపించలేదు. సరే సద్దుమణిగిందేమో అనుకుంటే ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది కానీ ఏజెంట్ బుల్లితెర దర్శనం జరగలేదు. పోనీ శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినా చూద్దామంటే ఆ అదృష్టమూ లేదు. ఇటీవలే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు తెలుగు ఏజెంట్ అతి త్వరలో ఓటిటిలో రావొచ్చనే వార్త ఇప్పటికైతే నిజం కాదు.
ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు మహా అయితే యాభై రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్న ట్రెండ్ లో ఏజెంట్ ఏడాదికి పైగానే వెయిటింగ్ లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికైనా సోని లివ్ సమస్య ఏదైనా ఉంటే త్వరగా పరిష్కరించుకుని తమ హీరోని హెచ్డిలో చూపించమని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి వాళ్ళు వింటారో లేదో కానీ మొత్తానికి ఒక స్టార్ హీరో మూవీ ఇన్ని నెలల తర్వాత కూడా డిజిటల్ లో రాకపోవడం విచిత్రం. హిందీ అనౌన్స్ మెంట్ వచ్చింది కాబట్టి తెలుగు శుభవార్త కూడా వినొచ్చని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. చూద్దాం.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…