Movie News

రవితేజతో పీపుల్స్ మీడియా నాలుగోసారి

మాస్ మహారాజా రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సింక్ కుదిరిపోయింది. పక్కా ప్లానింగ్ తో వేగంగా సినిమాలు తీయడంలో ముందున్న ఈ బ్యానర్ తో పని చేసేందుకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే అంగీకారం తెలిపినప్పుడు స్పీడ్ కు మారుపేరైన రవితేజ ఆగుతారా. ఇప్పటిదాకా ఈ కాంబోలో మూడు చిత్రాలొచ్చాయి. ధమాకా బ్లాక్ బస్టర్ కాగా ఈగల్ అంచనాలు అందుకోలేకపోయినా ప్రయత్న పరంగా ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ నిర్మాణంలో ఉండగానే బజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి శ్రీకారం చుట్టబోతున్నారని టాక్.

దర్శకుడు బాబీతో ఒక ప్రాజెక్టు సెట్ చేసే పనిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్టు సమాచారం. ఇతన్ని ఇండస్ట్రీకి పవర్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. అది సూపర్ హిట్ కావడంతోనే వెంకీ మామ లాంటి మల్టీస్టారర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వాల్తేరు వీరయ్యలో హీరో చిరంజీవే అయినా తనకిచ్చిన పాత్ర ప్రాధాన్యం, బాబీతో వ్యక్తిగతంగా ఉన్న బాండింగ్ వల్ల రవితేజ అందులో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరూ ఒక కథ అనుకోవడం, నచ్చడం జరిగిపోయాయట. బాలయ్య 109లో బిజీగా ఉన్న బాబీ డిసెంబర్ లోగా దాని ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఫ్రీ అవుతాడు.

ప్రజల మనిషి టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఏదో పవర్ ఫుల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ బాబీ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే పేరుతో గతంలో సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్షన్లో ఒక సినిమా చేశారు. తర్వాత ఎవరూ వాడుకోలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ టాక్ అయితే ఉంది. మాస్ రాజాని మంచి ఎలివేషన్లతో చూపించడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే బాబీ ఈసారి కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తాడని అభిమానుల నమ్మకం. మిస్టర్ బచ్చన్, సితార బ్యానర్ సినిమా అవ్వగానే రవితేజ చేయబోయే ప్రాజెక్టు ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

This post was last modified on July 15, 2024 5:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా…

9 hours ago

అండ‌మాన్ రాజ‌ధాని పేరు మార్పు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండ‌మాన్ నికోబార్ దీవుల రాజ‌ధాని…

9 hours ago

రవితేజ మిస్…బాలయ్య ఫిక్స్

2025 సంక్రాంతికి బెర్తులు మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ఖరారు చేసుకున్న వాటిలో జనవరి 10 చిరంజీవి విశ్వంభరలో ఎలాంటి మార్పు లేదు.…

9 hours ago

జ‌గ‌న్ ‘వెక్కిరింపు’ రాజ‌కీయాలు!

ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ కు పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా.. కాకినాడ జిల్లా ప‌రిధిలోని 62 గ్రామాలు నీట మునిగాయి. వీటి లో…

10 hours ago

ప్రభాస్ చెప్పిన ఛత్రపతి రహస్యం

బాహుబలి, సలార్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం కానీ ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ అమాంతం పెంచిన సినిమాల్లో ఛత్రపతిది…

11 hours ago

మేజిక్ ఆలస్యానికి కారణాలు ఎన్నో

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీనికన్నా ముందే ఇదే సితార…

12 hours ago