Movie News

రవితేజతో పీపుల్స్ మీడియా నాలుగోసారి

మాస్ మహారాజా రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సింక్ కుదిరిపోయింది. పక్కా ప్లానింగ్ తో వేగంగా సినిమాలు తీయడంలో ముందున్న ఈ బ్యానర్ తో పని చేసేందుకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే అంగీకారం తెలిపినప్పుడు స్పీడ్ కు మారుపేరైన రవితేజ ఆగుతారా. ఇప్పటిదాకా ఈ కాంబోలో మూడు చిత్రాలొచ్చాయి. ధమాకా బ్లాక్ బస్టర్ కాగా ఈగల్ అంచనాలు అందుకోలేకపోయినా ప్రయత్న పరంగా ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ రైడ్ రీమేక్ మిస్టర్ బచ్చన్ నిర్మాణంలో ఉండగానే బజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి శ్రీకారం చుట్టబోతున్నారని టాక్.

దర్శకుడు బాబీతో ఒక ప్రాజెక్టు సెట్ చేసే పనిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్టు సమాచారం. ఇతన్ని ఇండస్ట్రీకి పవర్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. అది సూపర్ హిట్ కావడంతోనే వెంకీ మామ లాంటి మల్టీస్టారర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వాల్తేరు వీరయ్యలో హీరో చిరంజీవే అయినా తనకిచ్చిన పాత్ర ప్రాధాన్యం, బాబీతో వ్యక్తిగతంగా ఉన్న బాండింగ్ వల్ల రవితేజ అందులో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరూ ఒక కథ అనుకోవడం, నచ్చడం జరిగిపోయాయట. బాలయ్య 109లో బిజీగా ఉన్న బాబీ డిసెంబర్ లోగా దాని ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఫ్రీ అవుతాడు.

ప్రజల మనిషి టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ లెక్కన ఏదో పవర్ ఫుల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ బాబీ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే పేరుతో గతంలో సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల డైరెక్షన్లో ఒక సినిమా చేశారు. తర్వాత ఎవరూ వాడుకోలేదు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ టాక్ అయితే ఉంది. మాస్ రాజాని మంచి ఎలివేషన్లతో చూపించడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే బాబీ ఈసారి కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తాడని అభిమానుల నమ్మకం. మిస్టర్ బచ్చన్, సితార బ్యానర్ సినిమా అవ్వగానే రవితేజ చేయబోయే ప్రాజెక్టు ఇదే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

This post was last modified on July 15, 2024 5:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

1 hour ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

3 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

4 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

7 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

7 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

7 hours ago