ఆంధ్రప్రదేశ్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఉంటే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పరిస్థితి ఘోరంగా ఉండేదేమో. ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన అశ్వినీదత్.. జగన్కు బద్ధ వ్యతిరేకి అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముంగిట కూటమికి ఆయన పూర్తి మద్దతు తెలిపారు. జగన్ మీద విమర్శలు చేయడానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ‘కల్కి’ టార్గెట్ అయ్యేదే. ఆ చిత్రానికి అదనపు రేట్లు కూడా దక్కేవి కావు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కోరుకున్న స్థాయిలో కొంచెం హెచ్చు స్థాయిలోనే అదనపు రేట్లిచ్చారు. గరిష్టంగా రూ.125 మేర రేట్లు పెంచుకున్నారు. కానీ ఆల్రెడీ ఏపీలో టికెట్ల ధరలు పెంచగా.. అదనంగా ఈ స్థాయిలో రేట్లు పెంచడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపై ఎవరో కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
దీంతో ఆ వ్యవహారం తేలే వరకు కొత్త చిత్రాలకు ఎక్స్ట్రా రేట్లు ఇవ్వడం కష్టంగా మారింది. తెలుగులో ఇప్పుడిప్పుడే రేట్లు పెంచుకోవాల్సిన స్థాయి ఉన్న పెద్ద సినిమాలేవీ వచ్చేలా లేవు. ‘దేవర’ వచ్చే వరకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఐతే ఈ వారం విడుదల కాబోతున్న అనువాద చిత్రం ‘ఇండియన్-2’కు మాత్రం ఇది సమస్యగా మారింది.
ఈ చిత్రానికి తెలంగాణలో రేట్లు పెంచుకునే అవకాశం లభించింది. తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు ఏపీలో కూడా అదనపు రేట్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. సురేష్ బాబుకు ఒకప్పుడు టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ మధ్యలో జగన్ నుంచి స్టూడియో విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాక తటస్థంగా మారిపోయారు. అది పెద్ద ఇబ్బందేమీ కాదు కానీ.. కోర్టు వ్యవహారం వల్ల ఏపీ ప్రభుత్వం ఈ కేసు తేలే వరకు ఏ సినిమాకూ అదనపు రేట్లు ఇవ్వొద్దనుకుంది. దీంతో ఏపీలో నార్మల్ రేట్లతోనే ‘ఇండియన్-2’ రిలీజవుతోంది.
This post was last modified on July 12, 2024 6:58 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…