మంజుమ్మల్ బాయ్స్ రాకపోయి ఉంటే ఎప్పుడో 1991లో వచ్చిన గుణ గురించి ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా ప్రియతమా నీవచట కుశలమా పాటకొచ్చిన ప్రాముఖ్యం మరింత పెరిగింది. దీన్ని అవకాశంగా వాడుకోవాలని గుణ తమిళ వెర్షన్ ని గత జూన్ 21న రీ రిలీజ్ చేశారు. పిరమిడ్, ఎవర్ గ్రీన్ సంస్థలు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. కమల్ హాసన్ హీరో అందులోనూ కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న మూవీ కావడంతో కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు. నిజానికి దీని ఒరిజినల్ వెర్షన్ యావరేజ్. ఇతర భాషల్లో భారీ డిజాస్టర్. ఇళయరాజా సంగీతం వల్లే పేరు వచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ గుణ హక్కులు తన దగ్గర ఉన్నాయని ఘనశ్యామ్ హేమదేవ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. తనకు చెప్పకుండా రిలీజ్ చేశారని, దీని మీద శాశ్వత నిషేధం విధించి ఇప్పటిదాకా వసూలైన మొత్తాన్ని తనకు చెల్లించేలా ఆదేశించాలని విన్నవించుకున్నాడు. దీంతో ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం సదరు ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఇండియన్ 2 విడుదలవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని చాలా థియేటర్లలో గుణ ఆల్రెడీ తీసేశారు. ఏదేదో ఊహించుకున్నారు కానీ అంత రెస్పాన్స్ రాలేదట.
ఏదో కొత్త సినిమాల కోర్టు గొడవంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా పాత రీ రిలీజుల గురించి కూడా వివాదాలు చెలరేగడం విచిత్రం. టాలీవుడ్ రీ రిలీజుల ట్రెండ్ కొచ్చిన స్పందన చూశాక కోలీవుడ్ లోనూ ఇది ఊపందుకుంది. ముత్తు, గిల్లి, పోకిరి, అలవందాన్, బిల్లా, తుపాకీ లాంటి క్లాసిక్స్ ని గత నాలుగైదు నెలల నుంచి థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఎంతో కొంత సొమ్ములు బాగానే వస్తుండటంతో క్రమంగా హక్కులకు సంబంధించిన కాంట్రావర్సీలు మొదలయ్యాయి. దెబ్బకు పాత చిత్రాల నెగటివ్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్లను నిర్మాతను చెక్ చేసుకునే పనిలో పడ్డారట.
This post was last modified on July 11, 2024 5:51 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…