మంజుమ్మల్ బాయ్స్ రాకపోయి ఉంటే ఎప్పుడో 1991లో వచ్చిన గుణ గురించి ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా ప్రియతమా నీవచట కుశలమా పాటకొచ్చిన ప్రాముఖ్యం మరింత పెరిగింది. దీన్ని అవకాశంగా వాడుకోవాలని గుణ తమిళ వెర్షన్ ని గత జూన్ 21న రీ రిలీజ్ చేశారు. పిరమిడ్, ఎవర్ గ్రీన్ సంస్థలు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. కమల్ హాసన్ హీరో అందులోనూ కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న మూవీ కావడంతో కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు. నిజానికి దీని ఒరిజినల్ వెర్షన్ యావరేజ్. ఇతర భాషల్లో భారీ డిజాస్టర్. ఇళయరాజా సంగీతం వల్లే పేరు వచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ గుణ హక్కులు తన దగ్గర ఉన్నాయని ఘనశ్యామ్ హేమదేవ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. తనకు చెప్పకుండా రిలీజ్ చేశారని, దీని మీద శాశ్వత నిషేధం విధించి ఇప్పటిదాకా వసూలైన మొత్తాన్ని తనకు చెల్లించేలా ఆదేశించాలని విన్నవించుకున్నాడు. దీంతో ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం సదరు ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఇండియన్ 2 విడుదలవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని చాలా థియేటర్లలో గుణ ఆల్రెడీ తీసేశారు. ఏదేదో ఊహించుకున్నారు కానీ అంత రెస్పాన్స్ రాలేదట.
ఏదో కొత్త సినిమాల కోర్టు గొడవంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా పాత రీ రిలీజుల గురించి కూడా వివాదాలు చెలరేగడం విచిత్రం. టాలీవుడ్ రీ రిలీజుల ట్రెండ్ కొచ్చిన స్పందన చూశాక కోలీవుడ్ లోనూ ఇది ఊపందుకుంది. ముత్తు, గిల్లి, పోకిరి, అలవందాన్, బిల్లా, తుపాకీ లాంటి క్లాసిక్స్ ని గత నాలుగైదు నెలల నుంచి థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఎంతో కొంత సొమ్ములు బాగానే వస్తుండటంతో క్రమంగా హక్కులకు సంబంధించిన కాంట్రావర్సీలు మొదలయ్యాయి. దెబ్బకు పాత చిత్రాల నెగటివ్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్లను నిర్మాతను చెక్ చేసుకునే పనిలో పడ్డారట.
This post was last modified on July 11, 2024 5:51 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…