మంజుమ్మల్ బాయ్స్ రాకపోయి ఉంటే ఎప్పుడో 1991లో వచ్చిన గుణ గురించి ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా ప్రియతమా నీవచట కుశలమా పాటకొచ్చిన ప్రాముఖ్యం మరింత పెరిగింది. దీన్ని అవకాశంగా వాడుకోవాలని గుణ తమిళ వెర్షన్ ని గత జూన్ 21న రీ రిలీజ్ చేశారు. పిరమిడ్, ఎవర్ గ్రీన్ సంస్థలు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. కమల్ హాసన్ హీరో అందులోనూ కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న మూవీ కావడంతో కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు. నిజానికి దీని ఒరిజినల్ వెర్షన్ యావరేజ్. ఇతర భాషల్లో భారీ డిజాస్టర్. ఇళయరాజా సంగీతం వల్లే పేరు వచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ గుణ హక్కులు తన దగ్గర ఉన్నాయని ఘనశ్యామ్ హేమదేవ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. తనకు చెప్పకుండా రిలీజ్ చేశారని, దీని మీద శాశ్వత నిషేధం విధించి ఇప్పటిదాకా వసూలైన మొత్తాన్ని తనకు చెల్లించేలా ఆదేశించాలని విన్నవించుకున్నాడు. దీంతో ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం సదరు ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఇండియన్ 2 విడుదలవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని చాలా థియేటర్లలో గుణ ఆల్రెడీ తీసేశారు. ఏదేదో ఊహించుకున్నారు కానీ అంత రెస్పాన్స్ రాలేదట.
ఏదో కొత్త సినిమాల కోర్టు గొడవంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా పాత రీ రిలీజుల గురించి కూడా వివాదాలు చెలరేగడం విచిత్రం. టాలీవుడ్ రీ రిలీజుల ట్రెండ్ కొచ్చిన స్పందన చూశాక కోలీవుడ్ లోనూ ఇది ఊపందుకుంది. ముత్తు, గిల్లి, పోకిరి, అలవందాన్, బిల్లా, తుపాకీ లాంటి క్లాసిక్స్ ని గత నాలుగైదు నెలల నుంచి థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఎంతో కొంత సొమ్ములు బాగానే వస్తుండటంతో క్రమంగా హక్కులకు సంబంధించిన కాంట్రావర్సీలు మొదలయ్యాయి. దెబ్బకు పాత చిత్రాల నెగటివ్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్లను నిర్మాతను చెక్ చేసుకునే పనిలో పడ్డారట.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…