రేపు విడుదల కాబోతున్న భారతీయుడు 2 మీద విపరీతమైన అంచనాలు లేకపోయినా నిర్మాతలు తెలంగాణలో టికెట్ హైక్ కోసం అనుమతులు తెచ్చుకోవడం ప్రేక్షకుల కన్నా ముందు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒరిజినల్ వెర్షన్ రిలీజవుతున్న తమిళనాడులో మాములు ధరలే ఉండగా ఇక్కడ మాత్రం స్పెషల్ రేట్లు పెట్టడం విస్మయం కలిగించేదే. బహుశా భారతీయుడు 1 లాగా టాలీవుడ్ లోనే బాగా ఆడుతుందనే నమ్మకం కాబోలు. అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా లేవు కానీ ఉదయం త్వరగా మొదలయ్యే ప్రీమియర్ షోల నుంచి వచ్చే టాక్ ఓపెనింగ్స్ పరంగా కీలకం కానుంది.
ఇక్కడ భారతీయుడు 2 ముందు పలు సవాళ్లున్నాయి. విక్రమ్ సక్సెస్ కేవలం ఆ ఒక్క సినిమాకే పరిమితం కాకూడదని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే ఎంత శ్రమ అవుతున్నా ఆయనే స్వయంగా అన్ని రాష్ట్రాలు తిరిగి స్వయంగా ప్రమోషన్లు చేసుకున్నారు. ప్రధాన నగరాలూ అన్నీ కవర్ చేశారు. తెలుగులో సక్సెస్ లేక ఏళ్ళు గడిచిపోయినా సిద్దార్థ్ ఇందులో చేసింది చిన్న క్యారెక్టర్ కాదు. సో ఇది హిట్ అయితే తనకొచ్చే క్రెడిట్ పెద్దదే. రకుల్ ప్రీత్ సింగ్ సైతం దీని కోసమే ఎదురు చూస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం ఆశించిన మేజిక్ పాటల పరంగా చేయలేదు. సో భారమంతా బిజిఎం మీదే.
ఇక దర్శకుడు శంకర్ తన కంబ్యాక్ ని దీంతోనే ఋజువు చేసుకోవాల్సి ఉంటుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీద భారతీయుడు 2 రిజల్ట్ ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. ఇది బాగుంటేనే ఆయన మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఇలా రకరకాల క్యాలికులేషన్లు సేనాపతి ముందున్నాయి. వాటిని దాటుకోవడం బజ్ తక్కువగా ఉన్న ఇలాంటి పరిస్థితిలో అంత సులభం కాదు. పైగా భారతీయుడు 3 గురించి పదే పదే హైలైట్ చేయడం కొంత ప్లస్ కొంత మైనస్ గా మారింది. కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ జోష్ ని కమల్ హాసన్ ఏ మేరకు కొనసాగిస్తారో ఇంకొద్ది గంటల్లో తేలనుంది.
This post was last modified on July 11, 2024 10:50 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…