తెలుగు రియాలిటీ షోలలో ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ షో ఇప్పటిదాకా ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని తర్వాత నాగార్జున బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఆయనే అయిదు సిరీస్ లు నడిపించారు. ఇప్పుడు ఎనిమిదోది రానుంది. నాగ్ కొనసాగుతారని లేదా బాలయ్యని అడిగే అవకాశాలున్నాయని టాక్ వచ్చింది కానీ అవెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో వారం పది రోజులు ఆగాలి. ఈలోగా పార్టిసిపెంట్స్ జాబితా సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్టు సమాచారం. చూచాయగా వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చాయి.
వెయ్యి రూపాయల బిర్యానీ బిల్లుతో సీఎం రేంజ్ లో వైరలైన కుమారి ఆంటీ, తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సెలబ్రిటీల జాతకాలతో పాపులరైన వేణు స్వామి, జబర్దస్త్ ఆర్టిస్టు నుంచి చేపల పులుసు బిజినెస్ లోకి మారి ఆ తర్వాత రాజకీయ ప్రచారకర్తగా మారిన కిరాక్ ఆర్పి, చిన్న వీడియోతో ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే దాకా వెళ్లిన బర్రెలక్క, టీవీ ఆర్టిస్టులు తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ తదితరులు ఇందులో ఉన్నారట. స్టాండప్ కమెడియన్ శ్యామా హరిణితో పాటు సోషల్ మీడియా ఫేమ్ కుష్తిత కల్లపులు ఎంపికైనట్టు సమాచారం. సురేఖావాణి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆమె కూడా తోడవుతారు.
స్టార్ కలరింగ్ కోసం రాజ్ తరుణ్ ని సంప్రదించారట కానీ ఇప్పుడున్న కేసు ఇబ్బందులు, తిరగబడరా సామీ ప్రమోషన్ల కారణంగా హాజరు కాకపోవచ్చు. ప్రతిసారి ఫైనల్ ఎపిసోడ్ వచ్చేలోగా ఏదో ఒక వివాదంతో నడుస్తున్న బిగ్ బాస్ లో ఈసారి మరింత బలమైన గేమ్స్ ని డిజైన్క్ చేస్తున్నారట. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన రచ్చని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొన్ని కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి షో మొదలుపెట్టే ఆలోచన జరుగుతోంది. రియాలిటీ షోల ట్రెండ్ తగ్గుతున్న టైంలో బిగ్ బాస్ 8 తిరిగి కొత్త వైభవం తెస్తుందేమో చూడాలి.
This post was last modified on July 10, 2024 3:40 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…