తొమ్మిది వందల కోట్ల వసూళ్లతో థౌజండ్ మైలురాయి వైపు పరుగులు పెడుతున్న కల్కి 2898 ఏడి విజయాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న వాళ్లలో ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరే చెప్పాలి. దీపికా పదుకునే, కమల్ హాసన్ లకు మంచి పాత్రలే దక్కినప్పటికీ బాలీవుడ్ దిగ్గజానికి దొరికిన స్క్రీన్ స్పేస్, ఎలివేషన్లు వీళ్లకు లేవంటే అది అబద్దం కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ప్రభాస్ నే డామినేట్ చేసే స్థాయిలో అమితాబ్ చెలరేగిపోయారు. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో రిలీజ్ రోజు నుంచి వరసగా పెడుతున్న ట్వీట్లను చూసి చెప్పొచ్చు. కల్కిని అంత విపరీతంగా ప్రేమించారన్న మాట.
కల్కి విశేషాలను మరింత లోతుగా అందించే క్రమంలో వైజయంతి టీమ్ ఒక వీడియో సిరీస్ ని చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. త్వరలోనే ఫుల్ వెర్షన్ వదలబోతున్నారు. అందులో ఆయన మాట్లాడుతూ ఒకసారి హైదరాబాద్ వచ్చి స్థానిక ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో కల్కి 2898 ఏడి చూడాలని ఉందని, సినిమాలను ఇంత పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్ళతో కలిసి చూడాలని తన ఆకాంక్ష వ్యక్తపరిచారు. దీన్ని బట్టి ఆయన లైవ్ లో ఫ్యాన్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని అర్థమవుతోందిగా.
నిజానికి దేశంలో ఎక్కడ లేని సినిమా ప్రేమ సౌత్ లోనే కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఈ హంగామా ఒకటి రెండు రోజులకు పరిమితమైతే మన దగ్గర పాత రీ రిలీజులను సైతం ఉదయం 8 గంటలకే హౌస్ ఫుల్స్ చేసి అల్లరి చేస్తారు. ఆ సెలబ్రేషన్స్ వీడియోల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ ఇవన్నీ గమనించే ఉంటారు. నిజంగా ఆయన రావాలే కానీ మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పనిలో పని ప్రభాస్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ లతో కలిసి వస్తే రచ్చ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం.
This post was last modified on July 9, 2024 6:53 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…