టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్కు కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు పడ్డాయి. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో అతను యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అతడికి తిరుగులేదు అనుకుంటే.. తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. హడావుడిగా సినిమాలు ఒప్పుకుని, క్వాలిటీ చూసుకోకపోవడంతో కెరీర్ తిరోగమనంలో పయనించింది.
సోలో హీరోగా అతను హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలో చేసిన సినిమాలు కూడా ఆడలేదు. ఇప్పుడు అతను హీరోగా ‘తిరగబడరా సామి’ అనే సినిమా రాబోతోంది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి రూపొందించిన చిత్రమిది.
ఐతే హీరోతో పాటు దర్శకుడూ ఫాంలో లేకపోవడంతో ఈ చిత్రానికి బజ్ లేదు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా అంతంతమాత్రంగా కనిపించింది. రాజ్ తనకు నప్పని మాస్ చొక్కా తొడుక్కున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో సినిమాకు బజ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో రాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం మీడియాలో చర్చనీయాంశం అయింది. రాజ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. ఆమె మీద రాజ్ కూడా పలు ఆరోపణలు చేశాడు. మరోవైపు ‘తిరగబడరా సామి’ హీరోయిన్ మాల్విని సైతం ఈ వివాదంలోకి లాగింది లావణ్య. ఆమెతో రాజ్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. మాల్వి ఈ ఆరోపణలకు దీటుగా బదులిస్తూ.. లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ‘తిరగబడరా సామి’ సినిమాకు కూడా కొంత పబ్లిసిటీ వస్తోంది.
ఐతే బాలీవుడ్లో సినిమాల రిలీజ్కు ముందు పబ్లిసిటీ కోసమే ఇలాంటి వివాదాలు రాజేసే ట్రెండ్ ఉంది. రాజ్-లావణ్య-మాల్వి గొడవ అలా క్రియేట్ చేసింది కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ల వ్యక్తిగత జీవితాల మీద ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. కానీ ఈ వివాదం వల్ల బజ్ లేని సినిమాకు పబ్లిసిటీ వచ్చి జనాల నోళ్లలో ఆ సినిమా పేరు నానుతోందన్నది మాత్రం వాస్తవం. మరి సినిమాకు ఇది ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on July 8, 2024 3:18 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…