రాజావారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో కెరీర్ ఆరంభంలో మంచి పేరు సంపాదించాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. కానీ ఈ సినిమాలతో వచ్చిన క్రేజ్ను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ లాంటి చిత్రాలు పర్వాలేదనిపించినా.. మిగతావన్నీ దారుణమైన డిజాస్టర్లుగా నిలిచాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుని చకచకా సినిమాలు లాగించేసిన కిరణ్కు చేదు అనుభవాలు తప్పలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన రూల్స్ రంజన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వరుస డిజాస్టర్లతో మార్కెట్, క్రేజ్ అంతా కరిగిపోవడంతో కిరణ్కు కెరీర్లో గ్యాప్ తప్పలేదు. దీంతో కొన్నాళ్లుగా తన పేరే వినిపించట్లేదు టాలీవుడ్లో.
ఐతే ఎట్టకేలకు కిరణ్ తన కొత్త చిత్రం కబురు చెప్పాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇచ్చాడు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పోస్ట్ కార్డ్ నేపథ్యంలో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. అభినయ వాసుదేవ్ అనే అమ్మాయి.. దీపాల పద్మనాభం అనే ఎస్ఐకి ఈ లెటర్ రాసినట్లు హింట్ ఇచ్చారు. ఈ దీపాల పద్మనాభమే హీరో కిరణ్ అన్నమాట. అతను కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అని కూడా పేర్కొన్నారు. పోస్టు కార్డు కాలంలో నడిచే కథ అంటే ఇది పీరియడ్ మూవీ అని అర్థం.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ అనే బేనర్తో కలిసి కిరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ‘కేఏ ప్రొడక్షన్స్’ అంటూ తన బేనర్ పేరు కూడా పోస్టర్ మీద కనిపించింది. ఈ 9న ఈ మూవీ టైటిల్ను ప్రకటించబోతున్నారు. పోస్టర్ మీద దర్శకుడి పేరు వేయలేదు. పూర్తి వివరాల కోసం ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…