Movie News

కృష్ణంరాజు చూసుకుంటారు.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది

ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు ప్రభాస్. ఐతే ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చ జరిగేది. కానీ ఈ మధ్య దాని గురించి మాట్లాడుకోవడం మానేశారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఉండగా.. అతడి పెళ్లి గురించి చాలా తపన పడ్డారు.

‘బాహుబలి’ రెండో భాగం పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసేస్తామని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆ సినిమా విడుదలై ఏడేళ్లు గడిచిపోయాయి. గత ఏడాది కృష్ణంరాజు కాలం చేశారు కూడా. కానీ ప్రభాస్ ఇంకా పెళ్లి కొడుకు కాలేదు.

ప్రభాస్‌‌కు త్వరలోనే 45 ఏళ్లు నిండబోతుండడంతో ఇక అతను పెళ్లి చేసుకోడనే అంచనాకు వచ్చేశారు అభిమానులు. కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాత్రం తన కొడుకు పెళ్లి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పైనుంచి కృష్ణంరాజు అంతా చూసుకుంటారని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించడంపై శ్యామలాదేవి స్పందిస్తూ.. ‘‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు విజయాలు దక్కవని కొందరన్నారు. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మంచితనం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇది రుజువు.

కోట్లాదిమంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండాలని ప్రభాస్ కష్టపడుతున్నాడు. బాధ్యత తీసుకుని దృష్టి మరలకుండా ఈ పని చేస్తున్న అతను గొప్ప వ్యక్తి. ప్రభాస్ పెళ్లి చేయాలని మాకూ ఉంది. దేనికైనా సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. పై నుంచి కృష్ణంరాజు గారు అన్నీ చూసుకుంటారు. ఇప్పటివరకూ ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినవన్నీ జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుంది’’ అని శ్యామలాదేవి అన్నారు.

ప్రభాస్‌ మహర్దశ బాహుబలితోనే ముగిసిందని, ఇక అతను సక్సెస్ చూడలేడని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్యామలాదేవి.. ఇప్పుడు ఆయనకు పరోక్షంగా మరో పంచ్ వేశారు.

This post was last modified on July 7, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

3 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

4 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

5 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

8 hours ago