‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ సాధించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ చూసి వేరే ప్టార్ హీరోలకు కళ్లు కుట్టి ఉంటే ఆశ్చర్యం లేదు. కొందరేమో ఈ క్రేజ్, ఫాలోయింగ్ అంతా తాత్కాలికం అని.. దాన్ని ప్రభాస్ నిలబెట్టుకోలేడని అన్నారు.
ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో ఈ అంచనానే నిజమవుతుందా అనిపించింది. కానీ దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్ చెక్కు చెదరనిదని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది.
డిజాస్టర్ టాక్తో కూడా ప్రభాస్ ప్రతి సినిమా హిందీలో వంద కోట్ల వసూళ్ల క్లబ్బులో అడుగు పెడుతుండడం విశేషం. ‘సలార్’ హిందీ వెర్షన్తో రూ.200 కోట్ల క్లబ్బులోకి కూడా అడుగు పెట్టిన ప్రభాస్.. ఇంకోసారి ఆ మార్కును అందుకోబోతున్నాడు. ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సైతం హిందీలో అదరగొడుతోంది.
ఆల్రెడీ ‘కల్కి’ హిందీ వెర్షన్ రూ.175 కోట్ల మార్కును టచ్ చేసింది. రెండో వీకెండ్ మొదలు కాకముందే సాధించిన వసూళ్లు ఇవి. ఈ వీకెండ్లో ‘కల్కి’కి హిందీలో పెద్దగా పోటీ లేదు. దీంతో ఈ వారాంతంలోనూ బాక్సాఫీస్ లీడర్ ఆ చిత్రమే.
దీంతో అలవోకగా రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. ఐతే ‘బాహుబలి’ తర్వాత రిలీజైన సినిమా కాబట్టి ‘సాహో’కు క్రేజ్ ఉండొచ్చు. ‘సలార్’ పక్కా మాస్ సినిమా కాబట్టి దానికీ వసూళ్ల మోత మోగి ఉండొచ్చు.
కానీ ‘కల్కి’ లాంటి క్లాస్ టచ్ ఉన్న, ప్రయోగాత్మక చిత్రానికి హిందీలో ఇలాంటి వసూళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎప్పట్లాగే రూరల్ సెంటర్లలో ప్రభాస్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇది కేవలం ప్రభాస్ మేనియా వల్ల సాధ్యమవుతున్న వసూళ్లు అనడంలో సందేహం లేదు. హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ మీద ఇంత అభిమానం ఏంటి అని ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
This post was last modified on July 6, 2024 4:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…