టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజాగా అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
13 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని.. కానీ ఇటీవల రాజ్ తనకు దూరమయ్యాడని… తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటికి రావడం మానేశాడని.. తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని.. అలాగే తనను ఉద్దేశపూర్వంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడని.. తనను చంపేస్తానని బెదిరింపులు చేయిస్తున్నాడని.. ఇలా రకరకాల ఆరోపణలు చేసిందామె. ఐతే లావణ్య ఫిర్యాదు చేసినపుడు మీడియాతో కూడా ఏమీ స్పందించని పోలీసులు.. ఇప్పుడు లావణ్యకే నోటీసులు పంపడం గమనార్హం.
ఈ కేసును ప్రొసిజర్ ప్రకారం విచారించాలని నిర్ణయించుకున్న పోలీసులు.. రాజ్ తరుణ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 91 సీఆర్పీసీ కింద పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఆధారాలను బట్టి తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
ఐతే రాజ్ తనతో రిలేషన్షిప్లో ఉన్నాడనడానికి ఆధారాలు ఉన్నాయని లావణ్య చెబుతుండగా.. ఆమె మీద కూడా రాజ్ పలు ఆరోపణలు చేశాడు. ఆమె డ్రగ్స్ తీసుకుని తననే టార్చర్ చేసిందని.. ఆమెకు వేరే వ్యక్తితో కూడా సంబంధం ఉందని.. తనపై బ్లాక్మెయిలింగ్ కేసు ఉందని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేశాడు. అతను కూడా అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు. తాను కూడా లావణ్య మీద కేసు పెడతానంటున్నాడు. మరి ఈ పోరులో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
This post was last modified on July 6, 2024 4:51 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…