Movie News

సుప్రీమ్ హీరో మీద అంత బడ్జెట్ సేఫేనా

మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాక సాయి ధరమ్ తేజ్ కు బ్రేక్ వచ్చింది. అంతకు ముందు విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయినా వేగంగా సినిమాలు చేసేందుకు తొందరపడలేదు. సితార సంస్థలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించిన నెలల తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. కారణాలు బయటికి చెప్పకపోయినా స్క్రిప్ట్ విషయంలో భిన్నాభిప్రాయాలని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా తీయబోయే ప్యాన్ ఇండియా మూవీకి నూటా పాతిక కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం.

ఇంత పెద్ద మొత్తం సుప్రీమ్ హీరో మీద వర్కౌట్ అవుతుందానే సందేహం రావడం సహజం. అయితే నిరంజన్ రెడ్డి లెక్కలు వేరుగా ఉన్నాయి. హనుమాన్ తీస్తున్నప్పుడు తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మల మీద అంత ఖర్చు రిస్క్ అవుతుందని భావించిన వాళ్లే ఎక్కువ. కానీ వాటిని పటాపంచలు చేస్తూ మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పోటీని తట్టుకుని మరీ హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం ఎప్పటికీ మర్చిపోలేనిది. అంటే ప్రేక్షకులు హీరోకన్నా ఎక్కువగా కంటెంట్, అందులో గ్రాండియర్ ని ఇష్టపడుతున్నారని అర్థమైపోయింది. కనెక్ట్ అయ్యే రీతిలో చూపిస్తే కనక వర్షం కురిపిస్తారు.

ఈ సూత్రాన్ని నమ్ముకునే ఇంత బడ్జెట్ కి సిద్ధపడినట్టు తెలిసింది. హనుమాన్ విజయం తర్వాత ప్రియదర్శి, నభ నటేష్ కాంబోలో డార్లింగ్ తెరకెక్కించిన ప్రైమ్ షో ఇప్పుడు మొదలుపెట్టబోతున్న సాయి తేజ్ మూవీకి సంబరాల ఏటిగట్టు టైటిల్ ని పరిశీలిస్తోంది. రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఈ సినిమా మేకోవర్ కోసమే తేజు గత కొన్ని నెలలుగా బయటికి రావడం కాదు కదా వేరే కొత్త కథలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫాంటసీ మిక్స్ తో పాటు సస్పెన్స్, థ్రిల్ కలగలిసిన ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేలా టార్గెట్ చేసుకుని దానికి అనుగుణంగా షూట్ చేయబోతున్నారు.

This post was last modified on July 6, 2024 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago