Movie News

సుప్రీమ్ హీరో మీద అంత బడ్జెట్ సేఫేనా

మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాక సాయి ధరమ్ తేజ్ కు బ్రేక్ వచ్చింది. అంతకు ముందు విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయినా వేగంగా సినిమాలు చేసేందుకు తొందరపడలేదు. సితార సంస్థలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించిన నెలల తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. కారణాలు బయటికి చెప్పకపోయినా స్క్రిప్ట్ విషయంలో భిన్నాభిప్రాయాలని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా తీయబోయే ప్యాన్ ఇండియా మూవీకి నూటా పాతిక కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం.

ఇంత పెద్ద మొత్తం సుప్రీమ్ హీరో మీద వర్కౌట్ అవుతుందానే సందేహం రావడం సహజం. అయితే నిరంజన్ రెడ్డి లెక్కలు వేరుగా ఉన్నాయి. హనుమాన్ తీస్తున్నప్పుడు తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మల మీద అంత ఖర్చు రిస్క్ అవుతుందని భావించిన వాళ్లే ఎక్కువ. కానీ వాటిని పటాపంచలు చేస్తూ మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పోటీని తట్టుకుని మరీ హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం ఎప్పటికీ మర్చిపోలేనిది. అంటే ప్రేక్షకులు హీరోకన్నా ఎక్కువగా కంటెంట్, అందులో గ్రాండియర్ ని ఇష్టపడుతున్నారని అర్థమైపోయింది. కనెక్ట్ అయ్యే రీతిలో చూపిస్తే కనక వర్షం కురిపిస్తారు.

ఈ సూత్రాన్ని నమ్ముకునే ఇంత బడ్జెట్ కి సిద్ధపడినట్టు తెలిసింది. హనుమాన్ విజయం తర్వాత ప్రియదర్శి, నభ నటేష్ కాంబోలో డార్లింగ్ తెరకెక్కించిన ప్రైమ్ షో ఇప్పుడు మొదలుపెట్టబోతున్న సాయి తేజ్ మూవీకి సంబరాల ఏటిగట్టు టైటిల్ ని పరిశీలిస్తోంది. రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఈ సినిమా మేకోవర్ కోసమే తేజు గత కొన్ని నెలలుగా బయటికి రావడం కాదు కదా వేరే కొత్త కథలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫాంటసీ మిక్స్ తో పాటు సస్పెన్స్, థ్రిల్ కలగలిసిన ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేలా టార్గెట్ చేసుకుని దానికి అనుగుణంగా షూట్ చేయబోతున్నారు.

This post was last modified on July 6, 2024 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

25 minutes ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

1 hour ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

8 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

10 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

13 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

13 hours ago