నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసారకు కొనసాగింపు కోసం అభిమానుల ఎదురుచూపులు రెండేళ్లకు పైగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ నిరీక్షణకు చెక్ పెడుతూ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాణంలోనే ఇది రూపొందనుంది. మొదటి భాగం దర్శకత్వం వహించిన వసిష్ఠ చిరంజీవి విశ్వంభరలో బిజీగా ఉండటంతో ఇప్పుడా బాధ్యతను అనిల్ పాడూరికి ఇచ్చారు. ఆకాష్ పూరితో రొమాంటిక్ తీసిన అనుభవం తప్ప సోసియో ఫాంటసీని గతంలో హ్యాండిల్ చేయలేదు. అయినా కళ్యాణ్ రామ్ నమ్మి అవకాశం ఇచ్చాడు.
అయితే ఇది అందరూ అనుకున్నట్టు బింబిసార కంటిన్యూయేషన్ కాదట. ఇతని కన్నా వందల సంవత్సరాలకు ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరో లెజెండరీ రాజుకు సంబంధించిన కథను తీసుకున్నారని వినికిడి. స్క్రిప్ట్ పక్కాగా రావాలనే ఉద్దేశంతోనే నెలల తరబడి అనౌన్స్ మెంట్ వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఏ రాజుని చూపించబోతున్నారనేది రివీల్ చేయకపోయినా పోషించేది కళ్యాణ్ రామేనని వేరే చెప్పనక్కర్లేదు. ఈ మధ్య తెలుగు సినిమాలో చాలా ప్రాముఖ్యత దక్కించుకుంటున్న మహాభారత గాథ ఛాయలు ఇందులో కూడా ఉంటాయని యూనిట్ టాక్.
అమిగోస్, డెవిల్ ఫలితాలు నిరాశపరిచినా కళ్యాణ్ రామ్ ప్రయోగాలు మాత్రం ఆపలేదు. 21వ సినిమా మాత్రం యాక్షన్ జానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. మెరుపు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. లేడీ అమితాబ్ విజయశాంతిని ఒప్పించారంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టుంది. దీని తర్వాత రాబోయే సినిమా ఇవాళ ఇచ్చిన ప్రకటన. అయితే టైటిల్ మారొచ్చని, క్యాప్షన్ గా బింబిసార 2 అని పెట్టి అసలు రాజు పేరుని హైలైట్ చేయబోతున్నారని తెలిసింది. అతనెవరు లాంటి వివరాలు తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. హీరోయిన్ తదితర వివరాలు ప్రస్తుతానికి గుట్టుగా ఉంచారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…