సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితం థియేటర్లలో విడుదలై మూడు నెలలు దాటేసింది. అప్పట్లో విమర్శకులు ఆహా ఓహో అని మెచ్చుకున్నారు. మలయాళం వెర్షన్ వసూళ్లు వంద కోట్లు దాటేసి ఔరా అనిపించాయి. తెలుగు డబ్బింగ్ తో పాటు ఇతర అనువాదాలు ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ చూసిన కొద్దిమంది గొప్ప ప్రయత్నమని మెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పటిదాకా ఇది ఓటిటి స్ట్రీమింగ్ జరుపుకోలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ సర్వైవల్ డ్రామాని తొలుత హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగినా డిజిటల్ మోక్షం దక్కలేదు.
అంతర్గత సమాచారం మేరకు గోట్ లైఫ్ ఆడు జీవితంకి ఇంకా ఓటిటి డీల్ జరగలేదట. నిర్మాతలు అడిగిన ధరకు డిజిటల్ కంపనీ ఇచ్చిన ఆఫర్ కు మధ్య వ్యత్యాసం వల్లే పెండింగ్ లో ఉండిపోయిందని అంటున్నారు. ఈ సినిమా చూడని ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉంది. స్మార్ట్ ప్లాట్ ఫార్మ్ మీద వచ్చినప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళను నిరాశ పరుస్తూ ఎంతకీ రాకపోవడం విచిత్రమే. ఇదే తరహాలో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన లాల్ సలామ్ సైతం బుల్లితెరపై రాలేదు. పీడకలగా మిగిలే డిజాస్టర్ కావడంతో దాని గురించి ఫ్యాన్స్ డిమాండ్ చేయడం లేదు.
ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. పేరున్న స్టార్లు ఉన్నంత మాత్రాన ఓటిటిలు గుడ్డిగా ఎక్కువ రేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. కంటెంట్ ఏ జానర్ లో ఉంది, ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ గా దాని స్కేల్ ఎంత ఉందని రకరకాల లెక్కలు వేసుకుని మరీ ధరను నిర్ణయిస్తున్నారు. కేవలం స్టార్ పవర్, బ్రాండ్లు పని చేయడం లేదని అర్థమవుతోంది కదా. లేకపోతే గోట్ లైఫ్ ఎప్పుడో రావాల్సింది. అఖిల్ ఏజెంట్ సైతం ఏడాదికి పైగా సోనీ లివ్ దగ్గరే మూలుగుతోంది కానీ బయటికి రావడం లేదు. కోర్టు వివాదమన్నారు కానీ ఆ వ్యవహారం గురించి ఎలాంటి కదలిక లేదు.
This post was last modified on July 3, 2024 5:47 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…