‘కల్కి 2898 ఏడీ’ సినిమా సామాన్య ప్రేక్షకులనే కాదు.. సెలబ్రెటీలను కూడా ఎంతగానో మెప్పించింది. దీన్ని ఇండియన్ ప్రైడ్గా అభివర్ణిస్తూ ఆ చిత్రం మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐతే మన ఇండస్ట్రీ వాళ్లు మన సినిమాను పొగిడితే అందులో ప్రత్యేకత ఏమీ కనిపించదు. వేరే పరిశ్రమ నుంచి దిగ్గజాలు మన సినిమాను కొనియాడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. అందులోనూ కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్.. ‘కల్కి’ని ప్రశంసిస్తే అది కచ్చితంగా ప్రత్యేకమే.
తన కొత్త చిత్రం ‘ఇండియన్-2’ ప్రమోషన్లలో భాగంగా ఆయన ‘కల్కి’ గురించి మాట్లాడారు. “నేను ఇటీవలే ‘కల్కి’ సినిమా చూశాను. అది భారతీయ సినిమాకు నిజమైన గర్వకారణం. నేను మూడు నెలల కిందటే ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేశాను. కల్కి కచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను. నేను చెప్పినట్లే ఈ చిత్రం ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా వెళ్తోంది” అని శంకర్ చెప్పాడు.
ఈ ఏడాదే రాబోతున్న పుష్ప-2, కంగువ చిత్రాలు కూడా వెయ్యి కోట్ల మార్కును అందుకుంటాయని.. తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రానున్న ‘కూలీ’ చిత్రం కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని శంకర్ జోస్యం చెప్పడం విశేషం. ఇక తన కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ గురించి శంకర్ మాట్లాడుతూ.. “ఆ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. దానికి సంబంధించి ఇంకో 10-15 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ‘ఇండియన్-2’ రిలీజ్ కాగానే షూట్ మొదలుపెడతాను. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చుంటాను. పోస్ట్ ప్రొడక్షన్ దశకు వెళ్లాక రిలీజ్ డేట్ మీద ఒక అంచనాకు వస్తాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని శంకర్ తెలిపాడు.
This post was last modified on July 3, 2024 3:26 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…