Movie News

50 వార్షికోత్సవ వేళ వైజయంతి ప్లాన్ ఏంటి

కల్కి 2898 ఏడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపన ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాల మైలురాయి చేరుకుంది. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై ఎదురులేని మనిషి లాంటి భారీ చిత్రంతో తెరంగేట్రం చేసి ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగడం ఒక చరిత్ర. తొలి చిత్రం విడుదలైంది 1975లో అయినప్పటికీ సంస్థ మొదలుపెట్టింది మాత్రం 1974లో కనక ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకునే దిశగా నిర్మాత అశ్వినీదత్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తారట. ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న ఇంద్రతో పాటు మహేష్ బాబు డెబ్యూ రాజకుమారుడుని భారీ ఎత్తున రీ రిలీజ్ చేసే ప్రతిపాదన సీరియస్ గా పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. వైజయంతి 50 ఈవెంట్ ఈ ఏడాది చేయాలా లేక వచ్చే సంవత్సరం నిర్వహించాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కల్కి 2ని అధికారికంగా ప్రకటించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఎప్పుడనేది డిసైడ్ అవ్వాలి.

వైజయంతిని స్వప్న, ప్రియాంకలతో పాటు నాగ్ అశ్విన్ నడిపిస్తున్న తీరు లెజెండరీ సంస్థ మనుగడకు గ్యారెంటీ ఇచ్చేసింది. దాన్ని నిలబెట్టే దిశగా వాళ్ళు చేస్తున్న ఆలోచనలు, మహానటి లాంటి సినిమాలు తీసే సాహసాలు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయి. ట్రెండ్ పేరుతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ఎలాంట కంటెంట్ జోలికి వెళ్లకుండా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా సరే క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే సిద్ధాంతాన్ని వదిలిపెట్టడం లేదు. శ్రీమతి కుమార్ లాంటి వెబ్ సిరీస్ లతో డిజిటల్ స్పేస్ లోనూ ముద్ర వేసేశారు. త్వరలోనే క్రేజీ ప్రాజెక్టులు చాలానే అనౌన్స్ కాబోతున్నాయి.

This post was last modified on July 2, 2024 7:35 pm

Share
Show comments

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

4 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago