Movie News

బిగ్‍బాస్‍: ఎవరినీ టార్గెట్‍ చేయకండర్రా!

బిగ్‍బాస్‍ షోలో ఎప్పుడయినా కానీ ఒక కంటెస్టెంట్‍ని ఎవరయినా టార్గెట్‍ చేస్తున్నట్టు అనిపిస్తే ఇక బయట ప్రేక్షకులు అతడు లేదా ఆమె వెంట నిలబడిపోతారు. హౌస్‍లో వాళ్లకు సపోర్ట్ దక్కకపోతే బయటనుంచి తమ ఓట్లతో వాళ్లను గెలిపించేస్తుంటారు. ఒకే వ్యక్తిని టార్గెట్‍ చేయడం ఎంత తప్పు అనేది తెలుగు సీజన్‍ 2లోనే తెలిసి వచ్చి వుండాలి. ‘కౌశల్‍’ని అప్పటి హౌస్‍మేట్స్ అదే పనిగా టార్గెట్‍ చేయడం అతడిని విజేతగా నిలబెట్టింది. గత సీజన్లో అదే తప్పు శ్రీముఖి చేసింది. ప్రతి నామినేషన్లోను నిన్ను పెడతానంటూ రాహుల్‍ సిప్లిగంజ్‍ని టార్గెట్‍ చేస్తూ మాట్లాడేది. అది కాస్తా శ్రీముఖి విజయావకాశాలను దెబ్బ తీసింది.

అసలు ఎలాంటి గేమ్‍ ఆడకుండానే రాహుల్‍కి బిగ్‍బాస్‍ కిరీటం దక్కింది. ఇవన్నీ చూసి కూడా ఈ సీజన్లో బిగ్‍బాస్‍ హౌస్‍లో వున్న వాళ్లు తమకు తెలియకుండానే కుమార్‍ సాయిని టార్గెట్‍ చేస్తున్నారు. మొదట ఆడియన్స్ అది పట్టించుకోకపోయినా కానీ సోమవారం నామినేషన్‍ ఎపిసోడ్‍తో కుమార్‍ సాయికి ఒక్కసారిగా సింపతీ పెరిగిపోయింది.

చాలా మంది కలిసి ఒక్కడినే టార్గెట్‍ చేస్తున్నారంటూ అతడికి సింపతీ ఓట్లు మొదలైపోయాయి. దీనిని ఆదిలోనే కట్‍ చేయగలిగితే ఓకే కానీ ఈ తరహా ఎపిసోడ్లు మరో రెండు పడ్డాయంటే మాత్రం ఇక అంతే సంగతులు. అసలే మన తెలుగు ప్రేక్షకులు సెంటిమెంట్‍ కోసం ఏ ఎండ్‍కి అయినా వెళ్లిపోతారు.

This post was last modified on September 22, 2020 10:57 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

36 minutes ago

హమ్మయ్యా… పెద్ద బరువు తీరినట్టేనా

తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…

1 hour ago

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…

1 hour ago

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

2 hours ago

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

2 hours ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

3 hours ago