ఇంతింతై అన్నట్టు ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ అంతకంతా పెరుగుతూ పోవడం సినిమా సినిమాకు చూస్తున్నాం. బాహుబలి తర్వాత సాహో మన దగ్గర నిరాశ పరిచినా నార్త్ లో బాగానే ఆడింది. రాధే శ్యామ్ డిజాస్టరనిపించుకున్నా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఆదిపురుష్ ఏకంగా ట్రోలింగ్ బారిన పడింది. అయినా నాలుగు వందల కోట్లు దాటాయి. సలార్ మిక్స్ టాక్ తోనే సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టింది. ఇంకా షేర్ పరంగా దాటలేదు కానీ సాధ్యమయ్యేలా ఉందని ట్రేడ్ పండితుల అంచనా.
నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే లిస్టులో ముందు వరసలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ చూపిస్తానని మారుతీ పలు సందర్భాల్లో హామీ ఇవ్వడంతో అభిమానుల అంచనాలు దీని మీద మాములుగా లేవు. కల్కి ఫలితం చూశాక ఒక్కసారిగా రాజా సాబ్ మీదున్న డిమాండ్, హక్కుల కోసం వస్తున్న ఫోన్ కాల్స్ అమాంతం ఎక్కువయ్యాయని ఇన్ సైడ్ టాక్.
ఇది ముందే ఊహించిందే అయినప్పటికీ జాక్ పాట్ అనే పదం వాడకం వెనుక కారణం ఉంది. రాజా సాబ్ కల్కి లాగా ఆరేడు వందల కోట్లతో రూపొందింది కాదు. దానిలో సగమే మారుతీ సబ్జెక్టు డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఖర్చు చేశారు. కానీ బిజినెస్ మాత్రం కల్కి స్థాయిలో ఉండబోయేది మాత్రం నిజం. పైగా నార్త్ బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేస్తారు. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనల్ కాలేదు. 2025 సంక్రాంతి లేదా వేసవి వైపు చూస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒకటి లాక్ చేసుకుని డార్లింగ్ పుట్టిననేల అక్టోబర్లో ప్రకటించే అవకాశముంది.
This post was last modified on July 2, 2024 11:40 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…