ఇంతింతై అన్నట్టు ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ అంతకంతా పెరుగుతూ పోవడం సినిమా సినిమాకు చూస్తున్నాం. బాహుబలి తర్వాత సాహో మన దగ్గర నిరాశ పరిచినా నార్త్ లో బాగానే ఆడింది. రాధే శ్యామ్ డిజాస్టరనిపించుకున్నా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఆదిపురుష్ ఏకంగా ట్రోలింగ్ బారిన పడింది. అయినా నాలుగు వందల కోట్లు దాటాయి. సలార్ మిక్స్ టాక్ తోనే సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టింది. ఇంకా షేర్ పరంగా దాటలేదు కానీ సాధ్యమయ్యేలా ఉందని ట్రేడ్ పండితుల అంచనా.
నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే లిస్టులో ముందు వరసలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ చూపిస్తానని మారుతీ పలు సందర్భాల్లో హామీ ఇవ్వడంతో అభిమానుల అంచనాలు దీని మీద మాములుగా లేవు. కల్కి ఫలితం చూశాక ఒక్కసారిగా రాజా సాబ్ మీదున్న డిమాండ్, హక్కుల కోసం వస్తున్న ఫోన్ కాల్స్ అమాంతం ఎక్కువయ్యాయని ఇన్ సైడ్ టాక్.
ఇది ముందే ఊహించిందే అయినప్పటికీ జాక్ పాట్ అనే పదం వాడకం వెనుక కారణం ఉంది. రాజా సాబ్ కల్కి లాగా ఆరేడు వందల కోట్లతో రూపొందింది కాదు. దానిలో సగమే మారుతీ సబ్జెక్టు డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఖర్చు చేశారు. కానీ బిజినెస్ మాత్రం కల్కి స్థాయిలో ఉండబోయేది మాత్రం నిజం. పైగా నార్త్ బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేస్తారు. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనల్ కాలేదు. 2025 సంక్రాంతి లేదా వేసవి వైపు చూస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒకటి లాక్ చేసుకుని డార్లింగ్ పుట్టిననేల అక్టోబర్లో ప్రకటించే అవకాశముంది.
This post was last modified on July 2, 2024 11:40 am
కమర్షియల్ జానర్ జోలికి వెళ్లకుండా కాస్త విభిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటున్న సుహాస్ త్వరలో జనక అయితే కనకతో థియేటర్లలో…
అధికారం చేతిలో ఉంది కాదా అని వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూ…
మాములుగా సంగీత దర్శకులు ఎవరైనా ఒక మహర్దశ అనుభవించాక క్రమంగా నెమ్మదించడం సహజం. చరిత్ర చెప్పేది ఇదే. బ్లాక్ అండ్…
విజయవాడకు చెందిన యువ నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు.. రాధా తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. అయితే.. ఈవ్యాఖ్యల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని..…
చక్కగా కట్టుకుంటున్న ఇంటిని చిందర వందర చేయడం.. పీకేసి పందిరేయడం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహరణ ఏపీ రాజధాని…