నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి మేకోవర్ తో రెడీ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఒకటి వైరలవుతోంది. 2025లో లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్లానింగ్ లో ఉన్నారు. కాకపోతే కథ, దర్శకుడు ఇంకా లాక్ చేయలేదు.
పలువురితో చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వంత బ్యానర్ కాకుండా మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచనగా సన్నిహితుల మాట.
ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో మోక్షజ్ఞ అక్కయ్యలు బ్రాహ్మణి, తేజస్విని నిర్మాణ సారధ్యం వహించి తమ్ముడిని తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మరో టాక్ ఉంది. తేజస్విని ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యవహారాలను అన్ స్టాపబుల్ షో నుంచి బోయపాటి శీను సినిమా వరకు దగ్గరుండి చూసుకుంటోంది.
ఏపీలో కూటమి పాలన వచ్చేసింది కనక బ్రాహ్మణి కూడా బిజినెస్ లో బిజీ అయిపోయింది. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీటికి సంబంధించి అంతర్గతంగా డిస్కషన్లు జరుగుతున్నాయట.
కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ రావడానికి ఇదే సరైన సమయం. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా ఆయన వారసుడి కోసం ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదట్లో యాక్టింగ్ పట్ల ఆసక్తి లేనట్టు బయట కనిపించినా చివరికి నిర్ణయం మార్చుకుని తనను తాను బాగా సానబెట్టుకున్నట్టు తెలిసింది.
నందమూరి కొత్త తరంలో మోక్షజ్ఞతో పాటు హరికృష్ణ గారి మనవడు ఇంకో ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి తెరంగేట్రం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ కనీసం ఏడాదికి పైగానే పడుతుంది.
This post was last modified on July 1, 2024 10:47 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…