నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి మేకోవర్ తో రెడీ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఒకటి వైరలవుతోంది. 2025లో లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్లానింగ్ లో ఉన్నారు. కాకపోతే కథ, దర్శకుడు ఇంకా లాక్ చేయలేదు.
పలువురితో చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వంత బ్యానర్ కాకుండా మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచనగా సన్నిహితుల మాట.
ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో మోక్షజ్ఞ అక్కయ్యలు బ్రాహ్మణి, తేజస్విని నిర్మాణ సారధ్యం వహించి తమ్ముడిని తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మరో టాక్ ఉంది. తేజస్విని ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యవహారాలను అన్ స్టాపబుల్ షో నుంచి బోయపాటి శీను సినిమా వరకు దగ్గరుండి చూసుకుంటోంది.
ఏపీలో కూటమి పాలన వచ్చేసింది కనక బ్రాహ్మణి కూడా బిజినెస్ లో బిజీ అయిపోయింది. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీటికి సంబంధించి అంతర్గతంగా డిస్కషన్లు జరుగుతున్నాయట.
కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ రావడానికి ఇదే సరైన సమయం. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా ఆయన వారసుడి కోసం ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదట్లో యాక్టింగ్ పట్ల ఆసక్తి లేనట్టు బయట కనిపించినా చివరికి నిర్ణయం మార్చుకుని తనను తాను బాగా సానబెట్టుకున్నట్టు తెలిసింది.
నందమూరి కొత్త తరంలో మోక్షజ్ఞతో పాటు హరికృష్ణ గారి మనవడు ఇంకో ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి తెరంగేట్రం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ కనీసం ఏడాదికి పైగానే పడుతుంది.
This post was last modified on July 1, 2024 10:47 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…