నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి మేకోవర్ తో రెడీ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఒకటి వైరలవుతోంది. 2025లో లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్లానింగ్ లో ఉన్నారు. కాకపోతే కథ, దర్శకుడు ఇంకా లాక్ చేయలేదు.
పలువురితో చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వంత బ్యానర్ కాకుండా మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచనగా సన్నిహితుల మాట.
ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో మోక్షజ్ఞ అక్కయ్యలు బ్రాహ్మణి, తేజస్విని నిర్మాణ సారధ్యం వహించి తమ్ముడిని తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మరో టాక్ ఉంది. తేజస్విని ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యవహారాలను అన్ స్టాపబుల్ షో నుంచి బోయపాటి శీను సినిమా వరకు దగ్గరుండి చూసుకుంటోంది.
ఏపీలో కూటమి పాలన వచ్చేసింది కనక బ్రాహ్మణి కూడా బిజినెస్ లో బిజీ అయిపోయింది. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీటికి సంబంధించి అంతర్గతంగా డిస్కషన్లు జరుగుతున్నాయట.
కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ రావడానికి ఇదే సరైన సమయం. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా ఆయన వారసుడి కోసం ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదట్లో యాక్టింగ్ పట్ల ఆసక్తి లేనట్టు బయట కనిపించినా చివరికి నిర్ణయం మార్చుకుని తనను తాను బాగా సానబెట్టుకున్నట్టు తెలిసింది.
నందమూరి కొత్త తరంలో మోక్షజ్ఞతో పాటు హరికృష్ణ గారి మనవడు ఇంకో ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి తెరంగేట్రం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ కనీసం ఏడాదికి పైగానే పడుతుంది.
This post was last modified on July 1, 2024 10:47 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…