నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి మేకోవర్ తో రెడీ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఒకటి వైరలవుతోంది. 2025లో లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్లానింగ్ లో ఉన్నారు. కాకపోతే కథ, దర్శకుడు ఇంకా లాక్ చేయలేదు.
పలువురితో చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వంత బ్యానర్ కాకుండా మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచనగా సన్నిహితుల మాట.
ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో మోక్షజ్ఞ అక్కయ్యలు బ్రాహ్మణి, తేజస్విని నిర్మాణ సారధ్యం వహించి తమ్ముడిని తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మరో టాక్ ఉంది. తేజస్విని ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యవహారాలను అన్ స్టాపబుల్ షో నుంచి బోయపాటి శీను సినిమా వరకు దగ్గరుండి చూసుకుంటోంది.
ఏపీలో కూటమి పాలన వచ్చేసింది కనక బ్రాహ్మణి కూడా బిజినెస్ లో బిజీ అయిపోయింది. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీటికి సంబంధించి అంతర్గతంగా డిస్కషన్లు జరుగుతున్నాయట.
కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ రావడానికి ఇదే సరైన సమయం. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా ఆయన వారసుడి కోసం ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదట్లో యాక్టింగ్ పట్ల ఆసక్తి లేనట్టు బయట కనిపించినా చివరికి నిర్ణయం మార్చుకుని తనను తాను బాగా సానబెట్టుకున్నట్టు తెలిసింది.
నందమూరి కొత్త తరంలో మోక్షజ్ఞతో పాటు హరికృష్ణ గారి మనవడు ఇంకో ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి తెరంగేట్రం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ కనీసం ఏడాదికి పైగానే పడుతుంది.
This post was last modified on July 1, 2024 10:47 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…