కల్కి సినిమాలో ముఖ్య పాత్రల గురించి ఎంత చర్చ జరిగిందో విజయ్ దేవరకొండ చేసిన అతిథి పాత్ర మీద కూడా అంతే డిస్కషన్ నడిచింది. విజయ్ ఇందులో ఒకట్రెండు నిమిషాలే కనిపించే అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఐతే అర్జునుడిగా విజయ్ గెటప్ బాలేదని.. తన డైలాగ్ డెలివరీ తేడా కొట్టిందని సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేశారు. దీని మీద పెద్ద గొడవే నడిచింది నెటిజన్ల మధ్య. కొన్ని రోజులుగా ఈ గొడవ నడుస్తుండగా.. తన ట్విట్టర్ హ్యాండిల్ డీపీలో తనను ట్రోల్ చేస్తున్న గెటప్ ఫొటోనే పెట్టి తన రూటే వేరని చాటాడు విజయ్. కాగా ఇప్పుడు ఈ పాత్ర గురించి అతను ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతోనూ మాట్లాడాడు.
అర్జున పాత్రకు వస్తున్న స్పందన పట్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పాత్రను తాను కేవలం దర్శకుడు నాగితో ఉన్న స్నేహం, ప్రభాస్ మీద ఉన్న అభిమానంతోనే చేసినట్లు విజయ్ తెలిపాడు. తాను ఇటీవలే సినిమా చూశానని.. ప్రేక్షకుల స్పందన మామూలుగా లేదని.. తన పాత్రకూ మంచి స్పందన వస్తోందని చెప్పాడు. కల్కి మూవీతో తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఇంత భారీ ప్రాజెక్టులో తాను కూడా భాగం కావడం గర్వంగా అనిపిస్తోందని విజయ్ తెలిపాడు. తాను సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. దాని ఇంపాక్ట్ బాగా ఉందని అతనన్నాడు.
ప్రభాస్తో పోటీ పడ్డారు, ఆయన మీదికే బాణాలు వేశారు కదా అని మీడియా వాళ్లు అడిగితే.. అక్కడ ఉన్నది తాను, ప్రభాస్ కాదని.. అర్జునుడు, కర్ణుడు అని విజయ్ అన్నాడు. ఇదిలా ఉండగా.. కల్కిలో విజయ్ చేసిన అర్జునుడి పాత్ర కోసం విజయ్ పారితోషకం ఏమీ తీసుకోకుండా ఉచితంగానే నటించినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on July 1, 2024 9:40 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…