Movie News

తండేల్ దర్శకుడి మెగా ప్లానింగ్

కథలు ఎంచుకునే విషయంలో, టేకింగ్ పరంగా దర్శకుడు చందూ మొండేటిది ప్రత్యేకమైన ముద్ర. మొదటి సినిమా కార్తికేయలో డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ ని తీయడం ద్వారా నిఖిల్ కో సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా డెబ్యూతోనే విమర్శకులను మెప్పించాడు. ఆ తర్వాత ప్రేమమ్ రీమేక్ అయినప్పటికీ నాగ చైతన్య కెరీర్ లో మంచి విజయం అందించింది. సవ్యాసాచి ఆశించిన ఫలితం అందించకపోయినా కార్తికేయ 2తో ఏకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం చైతు సాయిపల్లవి కలయికలో తండేల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా విభిన్నమైన బ్యాక్ డ్రాపే.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం చందూ మొండేటి మెగా ప్లాన్ వేస్తున్నాడట. అదేనండి చిరంజీవికి కథ చెప్పే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ద్వారా ప్రాథమికంగా ఒకసారి కలిశాడని అంటున్నారు. ఎలాగూ రామ్ చరణ్ నిర్మాతగా రూపొందుతున్న ది ఇండియా హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ హీరో కాబట్టి అక్కడిదాకా వెళ్లడం పెద్ద విషయం కాదు. కాకపోతే అధికారికంగా సమాచారం లేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి అంతర్గతంగా దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే ఉంది. తండేల్ డిసెంబర్ విడుదలని లక్ష్యంగా చేసుకుని షూటింగ్ లో ఉంది.

ఒకవేళ బాలయ్య 109, గేమ్ చేంజర్ అదే నెలలో వచ్చే పనైతే కాస్త ముందుగానే తండేల్ ని విడుదల చేసే ఆలోచనలో గీతా ఆర్ట్స్ బృందం చేస్తోంది. చందూ మొండేటి లిస్టులో కార్తికేయ 3 కూడా ఉంది. కాకపోతే స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధంగా లేదని వినిపిస్తోంది. ఎలాగూ నిఖిల్ బిజీగా ఉన్నాడు కాబట్టి తెరకెక్కడానికి బాగా టైం పడుతుంది. విశ్వంభరలో తలమునకలైన మెగాస్టార్ ఇంకా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. హరీష్ శంకర్ ముందు వరసలో ఉండగా ఇంకో ఇద్దరు ముగ్గురు వెయిటింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఆగస్ట్ 22 పుట్టినరోజు లోపు ఎవరో ఒకరిది ఖరారయ్యే అవకాశాలు లేకపోలేదు.

This post was last modified on July 1, 2024 9:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago