చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి చూస్తున్న తరుణంలో కల్కి 2898 ఏడికి వస్తున్న భారీ స్పందన థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల మోత మొదలుపెట్టిన ప్రభాస్ తన మొదటి అడుగుని నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ ని దాటేయడం నుంచి మొదలుపెట్టాడు. ట్రిపులార్ మైలురాయిని తేలికగా అందుకోవడమే కాదు రెండో రోజు అడుగు పెట్టే సమయానికే నాలుగు మిలియన్ డాలర్లు క్రాస్ చేయడం ద్వారా రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు కొత్త సవాల్ విసిరాడు. ఇండియా బిగ్గెస్ట్ ఓపెనర్ గా కల్కి మొదలుపెట్టిన వీరవిహారం ఆషామాషీ కాదు.
గత ఇరవై నాలుగు గంటల్లో ఒక్క బుక్ మై షో యాప్ లోనే 1.12 మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడం ముందు అరాచకం పదం చిన్నదే. అన్ని భాషలు కలిపే అయినప్పటికీ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. ట్రేడ్ టాక్ ప్రకారం కల్కి 2898 ఏడి మొదటి రోజు దేశవ్యాప్తంగా 110 కోట్లు, వరల్డ్ వైడ్ మొత్తం 170 కోట్ల గ్రాస్ సాధించినట్టు రిపోర్ట్. ఒక్క నైజామ్ నుంచే ఇరవై నాలుగు కోట్ల వసూళ్లు వచ్చినట్టు సమాచారం. సీడెడ్ అయిదు కోట్లతో కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ ఇంకో మూడు రోజులు వీకెండ్ ఉంది కాబట్టి ఫిగర్స్ భారీ ఎత్తున నమోదు కాబోతున్నాయి.
వర్కింగ్ డే గురువారం రిలీజ్ కావడంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, ఇండియా ఇంగ్లాండ్ సెమి ఫైనల్ మ్యాచ్, భారీ టికెట్ రేట్లు ప్రభావం చూపించిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి శని ఆదివారాల్లో మంచి మద్దతు దక్కేలా ఉంది. కాకపోతే తెలంగాణకు పోటీగా అంతకంటే ఎక్కువ టికెట్ రేట్ హైక్ ఏపీలో రావడం బిసి సెంటర్స్ లో ఎఫెక్ట్ ఇచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల షేర్ ఎనభై కోట్ల దగ్గరగా వెళ్లడం శుభ పరిమాణం. వీకెండ్ మొత్తం డార్లింగ్ కంట్రోల్ లోనే ఉండబోతోంది కనక రికార్డుల ఊచకోత గురించి పూర్తి స్పష్టత సోమవారం వచ్చేస్తుంది.
This post was last modified on June 28, 2024 12:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…