Movie News

కృష్ణుడి నిర్ణయం అన్నగారి మీద గౌరవమే

ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడిలో పలు అంశాల గురించి మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని దానికి సైన్స్ ఫిక్షన్ జోడించిన దర్శకుడు నాగ అశ్విన్ కీలకమైన అశ్వద్ధామ, అర్జునుడు లాంటి పాత్రలకు యాక్టర్లను తీసుకుని కథకు ప్రాణమైన శ్రీకృష్ణుడి పాత్రను మాత్రం ఒక నీడ లాంటి క్యారెక్టర్ తో నడిపించడం పట్ల ఫ్యాన్స్ లో పలు అనుమానాలు తలెత్తాయి. ముందు న్యాచురల్ స్టార్ నానినే కృష్ణుడనే ప్రచారం సోషల్ మీడియాలో తిరిగింది. కానీ అదేమీ నిజం కాదని బెనిఫిట్ షో చూడగానే అర్థమైపోయింది.

శ్రీకృష్ణుడిగా ఎవరినీ తీసుకోకపోవడం వెనుక ఒక ఆసక్తికరమైన సంగతి వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ సంస్థని 1974లో ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. మొదటి సినిమా కూడా ఆయనతోనే కలర్ సినిమా స్కోప్ లో తీశారు అశ్వినిదత్. స్వతహాగా ఆయన వీరాభిమాని కావడం వల్లే చిన్న వయసులోనే అంత సాహసానికి పూనుకున్నారు. అప్పటికే తెలుగు నేల మీద కృష్ణుడు, రాముడు అంటే ఒక్క ఎన్టీఆర్ తప్ప వేరెవరు కాదనే అభిప్రాయం అందరితో పాటు దత్తుగారి మనసులోనూ నాటుకుపోయింది. అందుకే బ్యానర్ లోగోకు అన్నగారి చిత్రాన్నే వాడుకున్నారు.

అంతటి ఆరాధనాభావం కలిగి ఉండటం వల్లే శ్రీకృష్ణుడుగా మరొకరిని చూపించలేననే దత్తు గారి ఆకాంక్షకు తగ్గట్టుగా నాగ్ అశ్విన్ ఆ పాత్రను అలా డిజైన్ చేసినట్టు తెలిసింది. ఇదంతా దర్శకుడు చెప్పింది కాకపోయినా యూనిట్ నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయం బయట పడింది. ఏదైతేనేం తెరమీద చేసిన ఈ మేజిక్ బ్రహ్మాండంగా పండింది. నిన్నటి దాకా ఏఐ టెక్నాలజీ వాడి ఎన్టీఆర్ నే కృష్ణుడిగా చూపించారనే ప్రచారం జరిగింది కానీ అదేమీ కాదు. ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్ ముడిపెట్టి ఒక కొత్త ప్రయోగం చేసిన నాగ్ అశ్విన్ దానికి తగ్గ గొప్ప ఫలితమే దక్కింది. 

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

44 minutes ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

4 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

8 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

8 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

10 hours ago