Movie News

కృష్ణుడి నిర్ణయం అన్నగారి మీద గౌరవమే

ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడిలో పలు అంశాల గురించి మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని దానికి సైన్స్ ఫిక్షన్ జోడించిన దర్శకుడు నాగ అశ్విన్ కీలకమైన అశ్వద్ధామ, అర్జునుడు లాంటి పాత్రలకు యాక్టర్లను తీసుకుని కథకు ప్రాణమైన శ్రీకృష్ణుడి పాత్రను మాత్రం ఒక నీడ లాంటి క్యారెక్టర్ తో నడిపించడం పట్ల ఫ్యాన్స్ లో పలు అనుమానాలు తలెత్తాయి. ముందు న్యాచురల్ స్టార్ నానినే కృష్ణుడనే ప్రచారం సోషల్ మీడియాలో తిరిగింది. కానీ అదేమీ నిజం కాదని బెనిఫిట్ షో చూడగానే అర్థమైపోయింది.

శ్రీకృష్ణుడిగా ఎవరినీ తీసుకోకపోవడం వెనుక ఒక ఆసక్తికరమైన సంగతి వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ సంస్థని 1974లో ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. మొదటి సినిమా కూడా ఆయనతోనే కలర్ సినిమా స్కోప్ లో తీశారు అశ్వినిదత్. స్వతహాగా ఆయన వీరాభిమాని కావడం వల్లే చిన్న వయసులోనే అంత సాహసానికి పూనుకున్నారు. అప్పటికే తెలుగు నేల మీద కృష్ణుడు, రాముడు అంటే ఒక్క ఎన్టీఆర్ తప్ప వేరెవరు కాదనే అభిప్రాయం అందరితో పాటు దత్తుగారి మనసులోనూ నాటుకుపోయింది. అందుకే బ్యానర్ లోగోకు అన్నగారి చిత్రాన్నే వాడుకున్నారు.

అంతటి ఆరాధనాభావం కలిగి ఉండటం వల్లే శ్రీకృష్ణుడుగా మరొకరిని చూపించలేననే దత్తు గారి ఆకాంక్షకు తగ్గట్టుగా నాగ్ అశ్విన్ ఆ పాత్రను అలా డిజైన్ చేసినట్టు తెలిసింది. ఇదంతా దర్శకుడు చెప్పింది కాకపోయినా యూనిట్ నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయం బయట పడింది. ఏదైతేనేం తెరమీద చేసిన ఈ మేజిక్ బ్రహ్మాండంగా పండింది. నిన్నటి దాకా ఏఐ టెక్నాలజీ వాడి ఎన్టీఆర్ నే కృష్ణుడిగా చూపించారనే ప్రచారం జరిగింది కానీ అదేమీ కాదు. ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్ ముడిపెట్టి ఒక కొత్త ప్రయోగం చేసిన నాగ్ అశ్విన్ దానికి తగ్గ గొప్ప ఫలితమే దక్కింది. 

This post was last modified on June 27, 2024 8:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

44 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago