దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాక తొమ్మిదేళ్ల ప్రయాణంలో తీసింది రెండే సినిమాలు. మొదటిది ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నాని స్టామినాని పెంచింది.
కట్ చేస్తే మహానటి ద్వారా ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు జనరేషన్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఆరు వందల కోట్ల మహాయజ్ఞం ద్వారా నాగఅశ్విన్ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళతో శేఖర్ కమ్ముల దగ్గర పని చేయాలని ప్రయత్నించారు నాగఅశ్విన్. వెంటనే అది సాధ్యపడకపోవడంతో నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ గా పని చేశాక లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు ఛాన్స్ దొరికింది. ఈలోగా ఒక మంచి షార్ట్ ఫిలింకు స్క్రిప్ట్ రాసుకున్న నాగఅశ్విన్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో స్వప్న సినిమా అధినేతలు ప్రియాంక, స్వప్న దత్ ల దృష్టిలో పడ్డాడు. అలా ఎవడే సుబ్రహ్మణ్యంకు శ్రీకారం జరిగింది. అది విజయవంతమయ్యాక తానెంతో అభిమానించే సావిత్రి గాథని స్క్రీన్ మీద చూపించాలన్న తాపత్రయంని అద్భుతంగా నెరవేర్చుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రూపంలో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక విజువల్ గ్రాండియర్ ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి నాగఅశ్విన్ ఇప్పటిదాకా ఒక స్టార్ హీరోతో వందల కోట్ల మార్కెట్ చేసే కమర్షియల్ సినిమా చేయలేదు. ప్రభాస్ కోసమే రాసుకున్నట్టు కల్కిని ఊహించిన విధానం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను సైతం ఇందులో భాగమయ్యేలా చేసింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సునామి సృష్టిస్తున్న కల్కి మాట్లాడకుండా తెగమోహమాట పడే ఒక క్రియేటివ్ జీనియస్ నాగ అశ్విన్ ఉండటమే ఆశ్చర్యం.
This post was last modified on June 26, 2024 2:37 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…