దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాక తొమ్మిదేళ్ల ప్రయాణంలో తీసింది రెండే సినిమాలు. మొదటిది ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నాని స్టామినాని పెంచింది.
కట్ చేస్తే మహానటి ద్వారా ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు జనరేషన్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఆరు వందల కోట్ల మహాయజ్ఞం ద్వారా నాగఅశ్విన్ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళతో శేఖర్ కమ్ముల దగ్గర పని చేయాలని ప్రయత్నించారు నాగఅశ్విన్. వెంటనే అది సాధ్యపడకపోవడంతో నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ గా పని చేశాక లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు ఛాన్స్ దొరికింది. ఈలోగా ఒక మంచి షార్ట్ ఫిలింకు స్క్రిప్ట్ రాసుకున్న నాగఅశ్విన్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో స్వప్న సినిమా అధినేతలు ప్రియాంక, స్వప్న దత్ ల దృష్టిలో పడ్డాడు. అలా ఎవడే సుబ్రహ్మణ్యంకు శ్రీకారం జరిగింది. అది విజయవంతమయ్యాక తానెంతో అభిమానించే సావిత్రి గాథని స్క్రీన్ మీద చూపించాలన్న తాపత్రయంని అద్భుతంగా నెరవేర్చుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రూపంలో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక విజువల్ గ్రాండియర్ ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి నాగఅశ్విన్ ఇప్పటిదాకా ఒక స్టార్ హీరోతో వందల కోట్ల మార్కెట్ చేసే కమర్షియల్ సినిమా చేయలేదు. ప్రభాస్ కోసమే రాసుకున్నట్టు కల్కిని ఊహించిన విధానం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను సైతం ఇందులో భాగమయ్యేలా చేసింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సునామి సృష్టిస్తున్న కల్కి మాట్లాడకుండా తెగమోహమాట పడే ఒక క్రియేటివ్ జీనియస్ నాగ అశ్విన్ ఉండటమే ఆశ్చర్యం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…