దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాక తొమ్మిదేళ్ల ప్రయాణంలో తీసింది రెండే సినిమాలు. మొదటిది ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నాని స్టామినాని పెంచింది.
కట్ చేస్తే మహానటి ద్వారా ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు జనరేషన్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఆరు వందల కోట్ల మహాయజ్ఞం ద్వారా నాగఅశ్విన్ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళతో శేఖర్ కమ్ముల దగ్గర పని చేయాలని ప్రయత్నించారు నాగఅశ్విన్. వెంటనే అది సాధ్యపడకపోవడంతో నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ గా పని చేశాక లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు ఛాన్స్ దొరికింది. ఈలోగా ఒక మంచి షార్ట్ ఫిలింకు స్క్రిప్ట్ రాసుకున్న నాగఅశ్విన్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో స్వప్న సినిమా అధినేతలు ప్రియాంక, స్వప్న దత్ ల దృష్టిలో పడ్డాడు. అలా ఎవడే సుబ్రహ్మణ్యంకు శ్రీకారం జరిగింది. అది విజయవంతమయ్యాక తానెంతో అభిమానించే సావిత్రి గాథని స్క్రీన్ మీద చూపించాలన్న తాపత్రయంని అద్భుతంగా నెరవేర్చుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రూపంలో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక విజువల్ గ్రాండియర్ ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి నాగఅశ్విన్ ఇప్పటిదాకా ఒక స్టార్ హీరోతో వందల కోట్ల మార్కెట్ చేసే కమర్షియల్ సినిమా చేయలేదు. ప్రభాస్ కోసమే రాసుకున్నట్టు కల్కిని ఊహించిన విధానం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను సైతం ఇందులో భాగమయ్యేలా చేసింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సునామి సృష్టిస్తున్న కల్కి మాట్లాడకుండా తెగమోహమాట పడే ఒక క్రియేటివ్ జీనియస్ నాగ అశ్విన్ ఉండటమే ఆశ్చర్యం.
This post was last modified on June 26, 2024 2:37 pm
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…