దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాక తొమ్మిదేళ్ల ప్రయాణంలో తీసింది రెండే సినిమాలు. మొదటిది ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నాని స్టామినాని పెంచింది.
కట్ చేస్తే మహానటి ద్వారా ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు జనరేషన్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఆరు వందల కోట్ల మహాయజ్ఞం ద్వారా నాగఅశ్విన్ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళతో శేఖర్ కమ్ముల దగ్గర పని చేయాలని ప్రయత్నించారు నాగఅశ్విన్. వెంటనే అది సాధ్యపడకపోవడంతో నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ గా పని చేశాక లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు ఛాన్స్ దొరికింది. ఈలోగా ఒక మంచి షార్ట్ ఫిలింకు స్క్రిప్ట్ రాసుకున్న నాగఅశ్విన్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో స్వప్న సినిమా అధినేతలు ప్రియాంక, స్వప్న దత్ ల దృష్టిలో పడ్డాడు. అలా ఎవడే సుబ్రహ్మణ్యంకు శ్రీకారం జరిగింది. అది విజయవంతమయ్యాక తానెంతో అభిమానించే సావిత్రి గాథని స్క్రీన్ మీద చూపించాలన్న తాపత్రయంని అద్భుతంగా నెరవేర్చుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రూపంలో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక విజువల్ గ్రాండియర్ ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి నాగఅశ్విన్ ఇప్పటిదాకా ఒక స్టార్ హీరోతో వందల కోట్ల మార్కెట్ చేసే కమర్షియల్ సినిమా చేయలేదు. ప్రభాస్ కోసమే రాసుకున్నట్టు కల్కిని ఊహించిన విధానం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను సైతం ఇందులో భాగమయ్యేలా చేసింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సునామి సృష్టిస్తున్న కల్కి మాట్లాడకుండా తెగమోహమాట పడే ఒక క్రియేటివ్ జీనియస్ నాగ అశ్విన్ ఉండటమే ఆశ్చర్యం.
This post was last modified on June 26, 2024 2:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…