ఇప్పుడు ఒక పెద్ద సినిమాకు ప్రకటించిన రిలీజ్ డేట్లోకి ఇంకో క్రేజీ మూవీ రావడం అన్నది మామూలు విషయం అయిపోయింది. ఆగస్టు 15కి ముందు అల్లు అర్జున్-సుకుమార్ల ‘పుష్ప-2’ను అనుకుంటే.. అది వాయిదా పడడంతో ఆ డేట్లోకి రామ్-పూరి జగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. మరోవైపు సెప్టెంబరు 27కు ముందు అనుకున్న సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కాగా.. అది అనుకోకుండా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ వచ్చేసింది. కాగా ఇప్పుడు తారక్ సినిమాకు అనుకున్న డేట్లోకి వేరే చిత్రం వస్తోందన్నది లేటెస్ట్ న్యూస్.
మాస్ రాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘మిస్టర్ బచ్చన్’ణు అక్టోబరు 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 10 అంటే దసరా వీకెండ్. ఈ క్రేజీ వీకెండ్ మీద ‘మిస్టర్ బచ్చన్’ టీం కన్నేసిందట.
అక్టోబరు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయాన్’ కూడా రిలీజ్ కాబోతోంది. దాంతో పాటు బాలీవుడ్ నుంచి ఒకటో రెండో క్రేజీ మూవీస్ రిలీజవుతాయి. ఆ టైంలో ‘దేవర’ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో సోలో డేట్ కోసం ‘దేవర’ టీం ముందుకు వచ్చింది.
ఐతే ‘మిస్టర్ బచ్చన్’ తెలుగులో మాత్రమే రిలీజవుతుంది కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందేమీ లేదు. రజినీ సినిమా పోటీని తట్టుకుని తెలుగులో ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టగలదు. ఈ చిత్రం షూటింగ్ దాదపుగా పూర్తయింది. రిలీజ్కు మంచి స్లాట్ కోసం చూస్తున్న టీం అన్నీ పరిశీలించి దసరాకు ఫిక్సయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
This post was last modified on June 26, 2024 2:34 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…