ఇప్పుడు ఒక పెద్ద సినిమాకు ప్రకటించిన రిలీజ్ డేట్లోకి ఇంకో క్రేజీ మూవీ రావడం అన్నది మామూలు విషయం అయిపోయింది. ఆగస్టు 15కి ముందు అల్లు అర్జున్-సుకుమార్ల ‘పుష్ప-2’ను అనుకుంటే.. అది వాయిదా పడడంతో ఆ డేట్లోకి రామ్-పూరి జగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. మరోవైపు సెప్టెంబరు 27కు ముందు అనుకున్న సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కాగా.. అది అనుకోకుండా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ వచ్చేసింది. కాగా ఇప్పుడు తారక్ సినిమాకు అనుకున్న డేట్లోకి వేరే చిత్రం వస్తోందన్నది లేటెస్ట్ న్యూస్.
మాస్ రాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘మిస్టర్ బచ్చన్’ణు అక్టోబరు 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 10 అంటే దసరా వీకెండ్. ఈ క్రేజీ వీకెండ్ మీద ‘మిస్టర్ బచ్చన్’ టీం కన్నేసిందట.
అక్టోబరు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయాన్’ కూడా రిలీజ్ కాబోతోంది. దాంతో పాటు బాలీవుడ్ నుంచి ఒకటో రెండో క్రేజీ మూవీస్ రిలీజవుతాయి. ఆ టైంలో ‘దేవర’ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో సోలో డేట్ కోసం ‘దేవర’ టీం ముందుకు వచ్చింది.
ఐతే ‘మిస్టర్ బచ్చన్’ తెలుగులో మాత్రమే రిలీజవుతుంది కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందేమీ లేదు. రజినీ సినిమా పోటీని తట్టుకుని తెలుగులో ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టగలదు. ఈ చిత్రం షూటింగ్ దాదపుగా పూర్తయింది. రిలీజ్కు మంచి స్లాట్ కోసం చూస్తున్న టీం అన్నీ పరిశీలించి దసరాకు ఫిక్సయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…