కరోనా-లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలు షూటింగ్లు ఆపేశారు సినీ జనాలు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యాయి. గత రెండు మూడు వారాల్లో చాలా సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. ఈ వరుసలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ కూడా వచ్చేసింది. సోమవారమే ఈ చిత్ర షూటింగ్ను తిరిగి ఆరంభించారు. ఐతే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే కొత్త షెడ్యూల్కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. అతను లేకుండానే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
నిన్న రాత్రి లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అందులో దర్శకుడు వేణు శ్రీరామ్, కెమెరామన్లతో పాటు ముగ్గురు నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. లొకేషన్లో వీళ్లతో పాటు ఒక లగ్జరీ కారు మాత్రమే కనిపిస్తోంది.
ఈ దృశ్యం చూస్తే ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ ‘పింక్’లో కొన్ని సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ముగ్గురు అమ్మాయిల మీద కొందరు కుర్రాళ్లు లైంగిక వేధింపులకు పాల్పడితే.. అమ్మాయిల వైపు నిలిచి సంబంధిత కేసును వాదించే లాయర్ కథ ఇది. ఒరిజినల్లో హీరో తెరపైకి రావడానికి ముందు కొంత కథ నడుస్తుంది. సంబంధిత సన్నివేశాలే ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది.
‘వకీల్ సాబ్’ చిత్రీకరణ అంతా పవన్ డేట్లను బట్టే సాగుతోంది. మొదటి నుంచి ఆయన అందుబాటులోకి వచ్చినపుడల్లా తనపై సన్నివేశాలు తీస్తూ వస్తున్నారు. ముందు ఆయన పార్ట్ పూర్తయితే.. తర్వాత మిగతా వాటి సంగతి చూద్దామన్నట్లు నడుస్తోంది వ్యవహారం. కరోనా నేపథ్యంలో పవన్ కొంచెం ఆలస్యంగా సెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఈలోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలన్నీ పూర్తి చేసేయాలని చిత్ర బృందం భావించినట్లుంది. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…