కరోనా-లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలు షూటింగ్లు ఆపేశారు సినీ జనాలు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యాయి. గత రెండు మూడు వారాల్లో చాలా సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. ఈ వరుసలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ కూడా వచ్చేసింది. సోమవారమే ఈ చిత్ర షూటింగ్ను తిరిగి ఆరంభించారు. ఐతే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే కొత్త షెడ్యూల్కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. అతను లేకుండానే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
నిన్న రాత్రి లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అందులో దర్శకుడు వేణు శ్రీరామ్, కెమెరామన్లతో పాటు ముగ్గురు నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. లొకేషన్లో వీళ్లతో పాటు ఒక లగ్జరీ కారు మాత్రమే కనిపిస్తోంది.
ఈ దృశ్యం చూస్తే ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ ‘పింక్’లో కొన్ని సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ముగ్గురు అమ్మాయిల మీద కొందరు కుర్రాళ్లు లైంగిక వేధింపులకు పాల్పడితే.. అమ్మాయిల వైపు నిలిచి సంబంధిత కేసును వాదించే లాయర్ కథ ఇది. ఒరిజినల్లో హీరో తెరపైకి రావడానికి ముందు కొంత కథ నడుస్తుంది. సంబంధిత సన్నివేశాలే ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది.
‘వకీల్ సాబ్’ చిత్రీకరణ అంతా పవన్ డేట్లను బట్టే సాగుతోంది. మొదటి నుంచి ఆయన అందుబాటులోకి వచ్చినపుడల్లా తనపై సన్నివేశాలు తీస్తూ వస్తున్నారు. ముందు ఆయన పార్ట్ పూర్తయితే.. తర్వాత మిగతా వాటి సంగతి చూద్దామన్నట్లు నడుస్తోంది వ్యవహారం. కరోనా నేపథ్యంలో పవన్ కొంచెం ఆలస్యంగా సెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఈలోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలన్నీ పూర్తి చేసేయాలని చిత్ర బృందం భావించినట్లుంది. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
This post was last modified on September 22, 2020 2:01 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…