కరోనా-లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలు షూటింగ్లు ఆపేశారు సినీ జనాలు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యాయి. గత రెండు మూడు వారాల్లో చాలా సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. ఈ వరుసలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ కూడా వచ్చేసింది. సోమవారమే ఈ చిత్ర షూటింగ్ను తిరిగి ఆరంభించారు. ఐతే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే కొత్త షెడ్యూల్కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. అతను లేకుండానే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
నిన్న రాత్రి లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అందులో దర్శకుడు వేణు శ్రీరామ్, కెమెరామన్లతో పాటు ముగ్గురు నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. లొకేషన్లో వీళ్లతో పాటు ఒక లగ్జరీ కారు మాత్రమే కనిపిస్తోంది.
ఈ దృశ్యం చూస్తే ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ ‘పింక్’లో కొన్ని సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ముగ్గురు అమ్మాయిల మీద కొందరు కుర్రాళ్లు లైంగిక వేధింపులకు పాల్పడితే.. అమ్మాయిల వైపు నిలిచి సంబంధిత కేసును వాదించే లాయర్ కథ ఇది. ఒరిజినల్లో హీరో తెరపైకి రావడానికి ముందు కొంత కథ నడుస్తుంది. సంబంధిత సన్నివేశాలే ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది.
‘వకీల్ సాబ్’ చిత్రీకరణ అంతా పవన్ డేట్లను బట్టే సాగుతోంది. మొదటి నుంచి ఆయన అందుబాటులోకి వచ్చినపుడల్లా తనపై సన్నివేశాలు తీస్తూ వస్తున్నారు. ముందు ఆయన పార్ట్ పూర్తయితే.. తర్వాత మిగతా వాటి సంగతి చూద్దామన్నట్లు నడుస్తోంది వ్యవహారం. కరోనా నేపథ్యంలో పవన్ కొంచెం ఆలస్యంగా సెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఈలోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలన్నీ పూర్తి చేసేయాలని చిత్ర బృందం భావించినట్లుంది. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా తీయాలని ఏడాది కిందట్నుంచి ప్రయత్నాలు…
భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…