తెలుగు సినిమా చరిత్రలో మహిళా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకు ఒక ఐకానిక్ మోడల్ గా నిలిచిపోయిన మూవీ కర్తవ్యం. 1990లో రిలీజై ఎలాంటి కమర్షియల్ హీరో లేకుండా కేవలం విజయశాంతి పాత్రనే హైలైట్ చేస్తూ దర్శకుడు మోహనగాంధీ తీర్చిదిద్దిన విధానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇండియాలో మొదటి పవర్ ఫుల్ లేడీ ఐపీఎస్ గా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడీ కథను ఆధారంగా చేసుకుని పరుచూరి సోదరులు రాసిన స్క్రిప్ట్ ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఆ తర్వాత విజయశాంతి ఖాకీ దుస్తుల్లో ఇంకొన్ని సినిమాలు చేశారు అవేవి కర్తవ్యంని టచ్ చేయడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు.
ఇప్పుడీ ప్రస్తావనకు కారణం సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇంకే ఆఫర్ ఒప్పుకోని విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమాలో వైజయంతి ఐపీఎస్ గా నటించడమే. కర్తవ్యంలోనూ ఇదే పేరు ఉంటుంది. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో వయసు మళ్ళినా కూడా అదే ఫైర్ చూపిస్తున్న లేడీ అమితాబ్ ని చూసి పాత అభిమానులు అలా జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ కాప్ డ్రామాకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు. షూటింగ్ కీలక దశలో ఉన్న ఎన్కెఆర్ 21 ఈ సంవత్సరమే విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.
చూస్తుంటే విజయశాంతి గారు తిరిగి సినిమాల్లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ఆర్సి 16లో ఆవిడో పాత్ర చేస్తుందనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో నిర్ధారణ కాలేదు. కానీ ఇప్పుడీ ఎన్కెఆర్ 21 టీజర్ చూశాక యాక్టింగ్ ని మళ్ళీ సీరియస్ గా తీసుకున్నారేమో అనిపిస్తోంది. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ కు గత ఏడాది చివరిలో డెవిల్ ది బ్రిటిష్ ఏజెంట్ ఫలితం నిరాశకు గురి చేసింది. అందుకే ఈసారి మాస్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. అంచనాలకు తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ కనిపిస్తోంది.
This post was last modified on June 24, 2024 12:21 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…