ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి.. ‘పుష్ప-2’. ‘పుష్ప’ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా సరే.. హిందీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకోవడంతో ఓవరాల్గా అది హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది.
పుష్పకు సంబంధించి పాటలు, మేనరిజమ్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేయడంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం సుకుమార్ అండ్ టీం చాలా టైం తీసుకుని, కష్టపడి పుష్ప-2 స్క్రిప్టు తయారు చేసింది.
అందువల్లే షూట్ అనుకున్న దాని కంటే ఆలస్యంగా మొదలైంది. సినిమా సెట్స్ మీదికి వెళ్లాక కూడా సుకుమార్ తనదైన శైలిలో చిత్రీకరణ సాగించడంతో షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరున్న సుకుమార్.. అంచనాలను మించి సినిమాను తీయాలన్న తపనతో బాగా ఆలస్యం చేసేశాడు. దీంతో ఆగస్టు 15 నుంచి సినిమా వెనక్కి వెళ్లిపోయింది. డిసెంబరు 6ను కొత్త రిలీజ్ డేట్గా ఎంచుకున్నారు.
ఐతే ఈసారి సినిమాను వాయిదా వేయడంతో సుకుమార్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. బన్నీ ఫ్యాన్స్ సహా అందరూ ఆయన్ని తిడుతున్నారు. సుకుమార్ ఏమైనా ‘బాహుబలి’లా ఎపిక్ మూవీ తీస్తున్నాడా ఇంత ఆలస్యం చేయడానికి.. అంతగా ఆయన ఏం అద్భుతాలు చేసేస్తున్నాడో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నడిచింది.
ఈ నేపథ్యంలో సినిమాలో కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా సుకుమార్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇదిలా ఉంటే.. ఇలీవల రాజకీయ కారణాలతో అల్లు అర్జున్ మెగా అభిమానుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వారాల నుంచి అతడి మీద ట్రోలింగ్ నడుస్తోంది. ‘పుష్ప-2’ వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణం అనే చర్చ కూడా జరుగుతోంది. ఆగస్టు 15న కనుక సినిమాను రిలీజ్ చేస్తే నెగెటివిటీ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ డిసెంబరు నాటికైనా ఈ నెగెటివిటీ తగ్గుతుందా అన్నది డౌట్. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే.. ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటుందనే భయం టీంను వెంటాడుతోంది. ఈ కారణాల వల్ల సుకుమార్ మీద టన్నుల కొద్దీ ప్రెజర్ పెరుగుతోందనడంలో సందేహం లేదు. ఆయన కచ్చితంగా ఒక ట్రూ బ్లాక్బస్టర్ ఫిలింను డెలివర్ చేయాల్సిందే.
This post was last modified on June 23, 2024 4:57 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…