ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి.. ‘పుష్ప-2’. ‘పుష్ప’ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా సరే.. హిందీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకోవడంతో ఓవరాల్గా అది హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది.
పుష్పకు సంబంధించి పాటలు, మేనరిజమ్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేయడంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం సుకుమార్ అండ్ టీం చాలా టైం తీసుకుని, కష్టపడి పుష్ప-2 స్క్రిప్టు తయారు చేసింది.
అందువల్లే షూట్ అనుకున్న దాని కంటే ఆలస్యంగా మొదలైంది. సినిమా సెట్స్ మీదికి వెళ్లాక కూడా సుకుమార్ తనదైన శైలిలో చిత్రీకరణ సాగించడంతో షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరున్న సుకుమార్.. అంచనాలను మించి సినిమాను తీయాలన్న తపనతో బాగా ఆలస్యం చేసేశాడు. దీంతో ఆగస్టు 15 నుంచి సినిమా వెనక్కి వెళ్లిపోయింది. డిసెంబరు 6ను కొత్త రిలీజ్ డేట్గా ఎంచుకున్నారు.
ఐతే ఈసారి సినిమాను వాయిదా వేయడంతో సుకుమార్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. బన్నీ ఫ్యాన్స్ సహా అందరూ ఆయన్ని తిడుతున్నారు. సుకుమార్ ఏమైనా ‘బాహుబలి’లా ఎపిక్ మూవీ తీస్తున్నాడా ఇంత ఆలస్యం చేయడానికి.. అంతగా ఆయన ఏం అద్భుతాలు చేసేస్తున్నాడో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నడిచింది.
ఈ నేపథ్యంలో సినిమాలో కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా సుకుమార్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇదిలా ఉంటే.. ఇలీవల రాజకీయ కారణాలతో అల్లు అర్జున్ మెగా అభిమానుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వారాల నుంచి అతడి మీద ట్రోలింగ్ నడుస్తోంది. ‘పుష్ప-2’ వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణం అనే చర్చ కూడా జరుగుతోంది. ఆగస్టు 15న కనుక సినిమాను రిలీజ్ చేస్తే నెగెటివిటీ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ డిసెంబరు నాటికైనా ఈ నెగెటివిటీ తగ్గుతుందా అన్నది డౌట్. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే.. ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటుందనే భయం టీంను వెంటాడుతోంది. ఈ కారణాల వల్ల సుకుమార్ మీద టన్నుల కొద్దీ ప్రెజర్ పెరుగుతోందనడంలో సందేహం లేదు. ఆయన కచ్చితంగా ఒక ట్రూ బ్లాక్బస్టర్ ఫిలింను డెలివర్ చేయాల్సిందే.
This post was last modified on June 23, 2024 4:57 pm
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత…
కల్కి 2898 ఏడీ లాంటి భారీ సినిమాలు రిలీజవుతుంటే.. సెలబ్రెటీలు కూడా సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి ఎంతో ఎగ్జైట్మెంట్తో థియేటర్లకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని…
ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే స్వయంగా తన ముందు అతి పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇద్దరు…
ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడిలో పలు అంశాల గురించి మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు…