వచ్చే వారం విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి విడుదల కోసం ప్రభాస్ అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ కు సరైన అర్థం తెలిపే రీతిలో దర్శకుడు నాగఅశ్విన్ కొత్త అనుభూతి ఇస్తాడనే నమ్మకం అందరిలో బలంగా ఉంది. ఇదిలా ఉండగా రెండు ట్రైలర్లతో చూచాయగా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన వైజయంతి బృందం ఊహించని బోలెడు సర్ప్రైజులు ఆడియన్స్ కోసం దాచి ఉంచింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని దాగేవి కాదు. వాటిలో సీతారామం జోడి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఉన్నారు.
లీకైన ఇన్ఫోని బట్టి వీళ్ళిద్దరూ ఇందులో కల్కి తల్లితండ్రులుగా కనిపిస్తారని తెలిసింది. విష్ణుయశస్, సుమతిలుగా ప్రాధాన్యం కలిగిన పాత్రల్లో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారట. ఒకవేళ కల్కి ప్రభాస్ అయితే ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారనుంది. మరి దీపికా పదుకునే, మాళవిక నాయర్ లు సైతం గర్భిణులుగా ఉన్న షాట్స్ ని ట్రైలర్ లో చూపించారు కాబట్టి అసలు ట్విస్టు ఏంటనేది తెరమీద చూడాలి. ఏ మాత్రం అంచనాలకు, స్పెకులేషన్లకు అందని విధంగా తెరమీద నాగఅశ్విన్ ఇవ్వబోయే సర్ప్రైజులకు మతులు పోవడం ఖాయమని వినికిడి.
ఇంకా నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి తదితరులు కూడా ఉన్నారనే ప్రచారం బలంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమా చూస్తున్నప్పుడు ఇవన్నీ నిజమైతే కనక ఈ థ్రిల్స్ కి ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. నైజామ్ లో థియేటర్ల కేటాయింపు జరుగుతోంది. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల వ్యవహారం తేలాక ఏపీకి సంబంధించిన లిస్టు బయటికి వస్తుంది. ఇంకో అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వీలైనంత త్వరగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం తొందరలోనే ఉన్నారు కానీ ఇంకో రెండు రోజులు ఆగక తప్పేలా లేదు.
This post was last modified on June 22, 2024 1:21 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…