ఇప్పుడున్న హీరోల్లో మోస్ట్ ప్రామిసింగ్ మార్కెట్ ఉన్నవాడిగా అడివి శేష్ కు ప్రేక్షకుల్లోనే కాదు ఇటు ఇండస్ట్రీలోనూ మంచి గౌరవముంది. ఎంత ఆలస్యమైనా క్వాలిటీ కోసం తప్ప ఇంక దేనికోసం రాజీపడని ఈ గూఢచారి ప్రస్తుతం దాని సీక్వెల్ తో పాటు డెకాయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్ మంచి విజయం అందుకున్నాక చెప్పుకోదగ్గ గ్యాపే ఇచ్చాడు. మేజర్ సక్సెస్ చూసి ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ఆఫర్లు ఇచ్చినా నో చెబుతూ వచ్చాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన పేరు వెనుక ఉన్న ఒక గమ్మత్తైన కథబి చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇతని అసలు పేరు సన్నీ చంద్ర. తండ్రి క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీరాభిమాని కావడంతో అలా కలిసొచ్చేలా పెట్టుకున్నాడు. కానీ అమెరికాలో ఉన్న టైంలో సన్నీ డిలైట్ అనే జ్యూస్ ఉండటంతో స్నేహితులు ఎగతాళి చేసేవాళ్ళు. అంతేకాదు సరిగ్గా అదే సమయంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ దూసుకురావడంతో మన సన్నీకి సమస్యలు మరింత పెరిగాయి. ఒకరకంగా ఆఫ్ లైన్ ట్రోలింగ్ అన్నమాట. దీంతో నాన్న సలహా మేరకు శేష్ గా పేరు మార్చుకుని తన తలమీద భారాన్ని తగ్గించుకున్నాడు. అయినా ఒక హీరోయిన్ పేరుతో కలుస్తోందని ఇలా చేయాల్సి రావడం బహుశా ఇది మొదటిసారి కావొచ్చు.
గూఢచారి 2, డెకాయిట్ రెండింట్లో ఒకటి ఈ సంవత్సరం విడుదల కావాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. టాలీవుడ్ డైరీ ఇప్పటికే డిసెంబర్ దాకా ఫుల్ అయిపోయింది. పైగా నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలు వేగంగా జరగడం లేదు. భారీ బడ్జెట్ తో పాటు ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకునే అడివి శేష్ కమిట్ మెంట్ ఊరికే డెడ్ లైన్ల మీద పని చేయదు. సో ఎలా చూసుకున్నా తనని స్క్రీన్ మీద 2025లోనే చూడాల్సి వస్తుంది. మూడేళ్ళ గ్యాప్ అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు. ఇవి కాకుండా వేరే కొత్త ప్రాజెక్టులు శేష్ ఇంకా ఫైనల్ చేయలేదు.
This post was last modified on June 21, 2024 3:52 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…