ఇప్పుడున్న హీరోల్లో మోస్ట్ ప్రామిసింగ్ మార్కెట్ ఉన్నవాడిగా అడివి శేష్ కు ప్రేక్షకుల్లోనే కాదు ఇటు ఇండస్ట్రీలోనూ మంచి గౌరవముంది. ఎంత ఆలస్యమైనా క్వాలిటీ కోసం తప్ప ఇంక దేనికోసం రాజీపడని ఈ గూఢచారి ప్రస్తుతం దాని సీక్వెల్ తో పాటు డెకాయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్ మంచి విజయం అందుకున్నాక చెప్పుకోదగ్గ గ్యాపే ఇచ్చాడు. మేజర్ సక్సెస్ చూసి ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ఆఫర్లు ఇచ్చినా నో చెబుతూ వచ్చాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన పేరు వెనుక ఉన్న ఒక గమ్మత్తైన కథబి చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇతని అసలు పేరు సన్నీ చంద్ర. తండ్రి క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీరాభిమాని కావడంతో అలా కలిసొచ్చేలా పెట్టుకున్నాడు. కానీ అమెరికాలో ఉన్న టైంలో సన్నీ డిలైట్ అనే జ్యూస్ ఉండటంతో స్నేహితులు ఎగతాళి చేసేవాళ్ళు. అంతేకాదు సరిగ్గా అదే సమయంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ దూసుకురావడంతో మన సన్నీకి సమస్యలు మరింత పెరిగాయి. ఒకరకంగా ఆఫ్ లైన్ ట్రోలింగ్ అన్నమాట. దీంతో నాన్న సలహా మేరకు శేష్ గా పేరు మార్చుకుని తన తలమీద భారాన్ని తగ్గించుకున్నాడు. అయినా ఒక హీరోయిన్ పేరుతో కలుస్తోందని ఇలా చేయాల్సి రావడం బహుశా ఇది మొదటిసారి కావొచ్చు.
గూఢచారి 2, డెకాయిట్ రెండింట్లో ఒకటి ఈ సంవత్సరం విడుదల కావాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. టాలీవుడ్ డైరీ ఇప్పటికే డిసెంబర్ దాకా ఫుల్ అయిపోయింది. పైగా నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలు వేగంగా జరగడం లేదు. భారీ బడ్జెట్ తో పాటు ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకునే అడివి శేష్ కమిట్ మెంట్ ఊరికే డెడ్ లైన్ల మీద పని చేయదు. సో ఎలా చూసుకున్నా తనని స్క్రీన్ మీద 2025లోనే చూడాల్సి వస్తుంది. మూడేళ్ళ గ్యాప్ అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు. ఇవి కాకుండా వేరే కొత్త ప్రాజెక్టులు శేష్ ఇంకా ఫైనల్ చేయలేదు.
This post was last modified on June 21, 2024 3:52 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…