బడ్జెట్ పరంగా చూస్తే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ని చెప్పొచ్చు. ఈ సినిమా మీద 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్కు తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు.. దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
హాలీవుడ్ స్టైల్ తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఫలితం కోసం టాలీవుడ్ మాత్రమే కాక మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రోమోలన్నీ బాగున్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. అయినా సరే ‘కల్కి’ ఫలితం మీద సగటు ప్రేక్షకుల్లో పూర్తి భరోసా అయితే కనిపించడం లేదు.
‘కల్కి’కి సంబంధించి విజువల్స్ అన్నీ వారెవా అనిపిస్తున్నా.. ఈ సినిమా కథ విషయంలోనే జనాలకు రకరకాల సందేహాలున్నాయి. ఎన్ని ప్రోమోలు చూసినా కథేంటన్నది అర్థం కావడం లేదు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ ముంగిట ప్రెల్యూడ్ ద్వారా.. అలాగే ప్రి రిలీజ్ ఈవెంట్లో పూర్తి కథేంటన్నది దాదాపుగా చెప్పేశాడు. మూడు వేర్వేరు ప్రపంచాలు అంటూ వాటి గురించి వివరించాలని చూశాడు.
ఐతే అతను ఎంత విడమరిచి చెప్పినా సామాన్య ప్రేక్షకులకు ఇప్పటికైతే కథ మీద ఒక క్లారిటీ రావట్లేదు. అతను చెబుతున్న నమ్మశక్యంగా, మింగుడు పడేలా లేకపోవడమే అందుక్కారణం. కొత్తగా, క్రేజీగా కథ రాసుకోవడం ఓకే కానీ.. ఆ కథల్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా తెరపై ప్రెజెంట్ చేయడమే సవాల్. తెర మీద తాము చూసేది కన్విన్సింగ్గా అనిపిస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు జై కొడతారు. విజువల్గా ‘కల్కి’ సూపర్ కాబట్టి కథ అర్థమైందంటే ఆటోమేటిగ్గా ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిపోతుందనడంలో సందేహం లేదు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…